
హోటళ్లపై ఆకస్మిక దాడులు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంతోష్ కుమార్ నాయక్, ఫుడ్ ఇన్స్పెక్టర్ పంకొజిని బెహురీలు బుధవారం సాయంత్రం పలు హోటళ్లలో ఆకస్మిక దాడులను నిర్వహించారు. గుణుపూర్ కొత్తబస్టాండు వద్ద గల హోటళ్లలో దాడులను నిర్వహించిన అధికారులు అయా హోటళ్లలో పరిశుభ్రత లోపం, నిల్వ ఉన్న ఆహారాలను గుర్తించి జరిమానా విధించారు. వర్షాకాలం కావడంతో డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆహారంలో నాణ్యత లేకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దాడులు చేస్తున్నామన్నారు.

హోటళ్లపై ఆకస్మిక దాడులు