
జీతం కోసం కలెక్టర్కు దరఖాస్తు
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలో వివిధ 14 తెగలకు చెందిన పూజార్లు నెలవారీ వేతనం కోసం గురువారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్కు వినతి పత్రం అందజేశారు. గిరిజనులకు మూలికలతో వైద్యం కూడా చేస్తున్నామని, అయినా ప్రభుత్వం తరఫున ఎలాంటి సౌకర్యాలు దొరకడం లేదన్నారు.
వికాస వాహనానికి ఘన స్వాగతం
జయపురం: రాష్ట్రంలో మోహన్ చరణ్ మఝి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా అన్ని పంచాయతీల్లో తిరుగుతున్న వికాస వాహనం గురువారం కుంద్ర సమితి డొంగరపంశి పంచాయతీకి చేరింది. వాహనానికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అటవీ విభాగం ద్వారా ప్రజలతో మొక్కలు నాటించారు. అనంతరం కొత్త రేషన్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఘాశీ భొత్ర, గ్రామ పంచాయతీ అధికారి, అటవీ విభాగ అధికారి, సామాజిక సురక్షా అధికారి, లేబర్ విభాగ అధికారి పాల్గొన్నారు.

జీతం కోసం కలెక్టర్కు దరఖాస్తు