
ముగిసిన అభివృద్ధి మేళా
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రం డీఎన్కే క్రీడా మైదానంలో గత వారం రోజులుగా నిర్వహించిన అభివృద్ధి మేళా గురువారంతో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అభివృద్ధి మేళాను నిర్వహించారు. చివరి రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బోండా, కోయి, శాంతాలి, గదబ, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నృత్య బృందాలకు జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సోభరో సర్టిఫికెట్లు అందజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ దారులుకు అభినందనలు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను అభినందించారు.

ముగిసిన అభివృద్ధి మేళా