
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జయపురం: జయపురం సమితి పంపుణీ గ్రామ పంచాయతీలో లిజెండ్ 2025 లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా సీనియర్ క్రీడాకారుడు నిరాకర రౌత్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఇలాంటి టోర్నమెంట్లు గ్రామీణ ప్రాంతంలో ఔత్సాహిక యువ క్రీడా కారులకు స్ఫూర్తినిస్తుందన్నారు. ప్రారంభంలో మొదటి మ్యాచ్ పంపుణీ రోయల్ చాలెంజేస్, లిజెండ్ పంపుణీ–11 జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంపుణీ రోయల్ చాలెంజెస్ టీమ్ నిర్ణీత 15 ఓవర్లలో 140 పరుగులు చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్ ప్రారంభించిన పంపుణీ లిజెండ్–11 టీమ్ గెలవాలన్న పట్టుదలతో ఆడి 10.5 ఓవర్లలో తన విజయ లక్ష్యం 141 పరుగులు చేసి పంపుణీ రోయల్ చాలెంజెస్ టీమ్ను ఓడించింది. లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు సుధీర్ రౌత్, సింహాచళ ప్రధాన్, రఘునాథ్ బెహర పాల్గొన్నారు.
రెగ్యులర్ బీడీవో లేక ఇబ్బందులు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో రెగ్యులర్ బీడీవో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం కొంతమంది యువకులు బొయిపరిగుడ సమితి కార్యాలయానికి వచ్చి బీడీవో కార్యాలయంలో లేక పోవటంతో పనులు జరగ నిరాఽశతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా వారు పత్రికల వారితో మాట్లాడుతూ.. తాము తమ పనుల కోసం ఎన్ని పర్యాయాలు వచ్చినా బీడీవో లేక పనులు జరగడం లేదని వాపోయారు. బొయిపరిగుడ బీడీవో అభిమణ్య కవి శతపతి గత మే నెల 31వ తేదీన రిటైర్ అయ్యారని.. ఆ తరువాత బీడీవోను నియమించకపోవడంతో తమకు ఇబ్బందులు వచ్చాన్నారు. ప్రభుత్వం పర్మినెంట్ బీడీవోను నియమించకుడా జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రోకు అప్పగించినట్టు వెల్లడించారు. రెండు సమితిల బాధ్యతలు చేపట్టిన శక్తి మహాపాత్రో బొయిపరిగుడ సమితికి ఎప్పుడు వస్తారో తెలియటం లేదన్నారు. దీంతో సమితిలోని 20 గ్రామ పంచాయతీల ప్రజలు పలు పనులపై బొయిపరిగుడ వస్తూ అధికారి లేక పోవటంతో నిరాశతో వెనుతిరుగుతున్నట్టు చెప్పారు. సుమారు 80, 90 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల నుంచి వస్తున్నప్పటికీ బీడీవో లేకపోవడంతో అవస్థలు పడుతున్నట్టు పేర్కొన్నారు. అధికారులు స్పందించి రెగ్యులర్ బీడీవోను నియమించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం
కొరాపుట్: అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కొత్త మార్కెట్ (రైతు బజార్) వెనుక వైపు కన్యకా పరమేశ్వరి దేవాలయం మార్గంలో పార్క్ గోడకి అనుకుని ఉన్న చిన్న సందులో యువకుడి (30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇదే సందులో చివరి భాగాన ఒక అనుమానాస్పద బ్యాగ్ పడి ఉంది. హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. జిల్లా కేంద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
రంగవల్లి తివాచీ
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం సింహ ద్వారం ముంగిట కనులు మిరమిట్లు గొలిపే భారీ రంగవల్లి తివాచీ తీర్చిదిద్దారు. రథ యాత్ర కోసం శ్రీ మందిరం నుంచి విచ్చేయనున్న జగతి నాథునికి స్వాగతం పలికేందుకు ప్రతిభావంతులైన కళాకారులు ఉత్సాహంతో దీన్ని రూపొందించారు. కళాకారులను శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టర్ అరవింద కుమార్ పాఢి ప్రత్యేకంగా అభినందించారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం