జంట నగరాల్లో పాఠశాలలకు సెలవు | - | Sakshi
Sakshi News home page

జంట నగరాల్లో పాఠశాలలకు సెలవు

Jun 19 2025 3:56 AM | Updated on Jun 19 2025 3:56 AM

జంట నగరాల్లో  పాఠశాలలకు సెలవు

జంట నగరాల్లో పాఠశాలలకు సెలవు

భువనేశ్వర్‌: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని జంట నగరాలు భువనేశ్వర్‌, కటక్‌ మహానగరం పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 20 శుక్రవారం ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా భువనేశ్వర్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

సామూహిక అత్యాచారంపై

ఎంపీ మండిపాటు

కొరాపుట్‌: బ్రహ్మపుర సమీపంలోని గోపాల్‌ పూర్‌ సీ బీచ్‌లో సామూహిక అత్యాచారంపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉల్క మండిపడ్డారు. ఏడాది కాలంలో ఎన్నో విజయాలు సాధించామని చెబుతున్న అధికార బీజేపీ సాధించిందేమిటో అర్థం అవుతుందన్నారు. ఇలాంటి దారుణమైన సంఘటనకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు. ఏడాది విజయాలు జరుపుకోవడానికి రాష్ట్రానికి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై ప్రకటన చేయాలన్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దీనిపై తాను పార్లమెంట్‌లో కూడా ప్రశ్నలు లేవనెత్తానన్నారు.

విపక్ష నేత నవీన్‌

పట్నాయక్‌కు అనారోగ్యం

భువనేశ్వర్‌: రాష్ట్రంలో విపక్ష నేత, బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు ఆయన ఈ నెల 22న ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో గర్భాశయ ఆర్థరైటిస్‌ చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపారు. విపక్ష నేత వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ రమాకాంత్‌ పండా ముంబైలో అనుబంధ కార్యకలాపాలు సమన్వయం చేస్తున్నారు. జగన్నాథ స్వామి ఆశీస్సులు, రాష్ట్రంలో సోదర సోదరీమణుల శుభాకాంక్షలతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం కొనసాగించడానికి త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నట్లు బుధవారం జారీ చేసిన సాంఘిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ అనారోగ్యం గురించి తెలిసి ఆందోళన చెందుతున్నట్లు ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి స్పందించారు. ఆయన చికిత్స ప్రక్రియ సజావుగా పూర్తియి త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యంతో దీర్ఘకాలం వర్ధిల్లాలని శ్రీ జగన్నాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

చెవిరెడ్డిని అరెస్టు చేయడం అరాచకం

నరసన్నపేట: లేని మద్యం స్కామ్‌ను చూపించి చంద్రబాబు ప్రభుత్వం అనేక మంది వైఎస్సార్‌ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భా స్కరరావును అరెస్టు చేయడం అన్యాయమన్నా రు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అరాచకానికి చెవి రెడ్డి అరెస్టు పరాకాష్ట అని అన్నారు. ఆయన అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యా లు సృష్టించి సిట్‌ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులో అదుపులోనికి తీసుకున్న వరకూ చెవిరెడ్డి ఈ కేసులో నిందితుడిగా నమోదు కా లేదని, కేసులకు భయపడేది లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement