
పెన్షన్ సమస్యలు పరిష్కరిస్తాం
కొరాపుట్: ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అదాలత్ బుధవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సద్భావన స్వగృహంలో నిర్వహించారు. కొరాపుట్, మల్కన్గిరి జిల్లాలకు చెందిన వారి వినతులు అధికారులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికారిక బృందంతోపాటు ఇరు జిల్లాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 500 వినతులు వచ్చాయని, అందులో ప్రత్యక్షంగా 60 మంది వినతిపత్రాలతో వచ్చారని అధికారులు ప్రకటించారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ మాట్లాడుతూ.. కొరాపుట్ జిల్లా నుంచి 400 వినతులు వచ్చాయని, మరో 40 మంది నేరుగా వచ్చి ఫిర్యాదులు చేశారన్నారు. రిటైర్మెంట్ రోజునే ఫైనల్ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో వైపు ఇదే శిబిరానికి కొట్పాడ్ మాజీ ఎమ్మెల్యే సదానాయక్ సతీమణి తిలోత్తమ నాయక్ వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఎమ్మెల్యే పని చేశారన్నారు. ఆయన ఇదివరకే మృతి చెందారన్నారు. తనకు పెన్షన్ రాకుండా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. బ్యాంక్కు వెళ్తే ట్రెజరీకి వెళ్లమన్నారని, ట్రెజరికి వెళ్తే కలెక్టర్కు కలవమన్నారని వాపోయారు. తాను ఇదే శిబిరంలో ఫిర్యాదు చేశానన్నారు.

పెన్షన్ సమస్యలు పరిష్కరిస్తాం