జాతీయ జూడో చాంపియన్‌షిప్‌కు.. మల్కన్‌గిరి విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ జూడో చాంపియన్‌షిప్‌కు.. మల్కన్‌గిరి విద్యార్థుల ఎంపిక

Jun 19 2025 3:56 AM | Updated on Jun 19 2025 3:56 AM

జాతీయ

జాతీయ జూడో చాంపియన్‌షిప్‌కు.. మల్కన్‌గిరి విద్యార్థుల ఎ

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభీమాన్‌ ఏరియా బోడపోదర్‌ పంచాయతీ లాంబాసింగ్‌ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ విద్యార్థులు రుక్‌నాఽథ్‌ సీస, రవినాథ్‌ జిగిడి నాయక్‌గూడ పాఠశాలలో చదువుతున్నారు. ఆర్థికంగా వెనుకబడినా క్రీడా ఆసక్తిని కనబర్చడంతో మల్కన్‌గిరి ఔమా గురుకులం, జూడో అసోసియేషన్‌ సభ్యులు గుర్తించారు. మల్కన్‌గిరి ఔమా గురుకులంలో శిక్షణ ఇచ్చారు. వీరు జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌కు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ ఈశ్వర్‌ అన్నారు. బుధవారం ఇద్దరు విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అభినందించారు. వారి ప్రయాణం గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జరగనున్న జూడో పోటీల్లో పాల్గొంటారన్నారు. వీరికి జిల్లా యంత్రాంగం రెడ్‌ క్రాస్‌ నుంచి ఆర్థిక సహాయం అందజేశారు.

జాతీయ జూడో చాంపియన్‌షిప్‌కు.. మల్కన్‌గిరి విద్యార్థుల ఎ1
1/1

జాతీయ జూడో చాంపియన్‌షిప్‌కు.. మల్కన్‌గిరి విద్యార్థుల ఎ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement