
చేతివృత్తులకు చేయూత అందించాలి
● బీజేపీ నేతలు జగన్నాథ మహాపాత్రో, ప్రశాంత్ పాలో
పర్లాకిమిడి: వికాస్ మేళాలో హస్తశిల్పి కళాకారులు, చేతి వృత్తులు, జిల్లా పరిశ్రమల శాఖ సమన్వయంతో జిల్లా ఇండస్ట్రీస్ కార్యాలయంలో బుధవారం అవగాహన శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరంలో హస్తకళల నిగమ్ అధికారి బిభురంజన్ స్వయిని, హస్త శిల్పి అధ్యయన అధికారులు సుశీల్ కుమార్ బారుద్, ప్రియాంకా పాత్రో, బీజేపీ కృషక్ మోర్చా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ పాలో, జిల్లా సాధారణ కార్యదర్శి (బీజేపీ) జగన్నాథ మహాపాత్రో హాజరయ్యారు. ముఖ్యమంత్రి మోహాన్ మఝి ప్రభుత్వం.. జిల్లా హస్తకళాకారులు, చేతివృత్తులు వారికి చేయూతనిచ్చే విశ్వకర్మ యోజనా పథకం ద్వారా లబ్ధిపొందడానికి చర్యలు చేపట్టాలని అధికారులను బీజేపీ శ్రేణులు కోరారు. చేతివృత్తులవారు ఈ విశ్వకర్మ యోజనా పథకం కింద శిక్షణ పొంది మూడు మాసాలైనా ఇప్పటివరకు టీఏ, డీఏ పొందలేకపోయామని శిక్షణార్థులు ఎకరువు పెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ప్రభుత్వ అధికారులు కూడా మారాలని జిల్లా బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో అన్నారు. హస్త శిల్పి కళాకారులు, చేతి వృత్తులు, ఆత్మనిర్భర్ భారత్పై అనేక సార్లు ప్రధాని మోడీ గురుత్వపూర్ణ ప్రసంగాలు చేశారన్నారు. అందువల్ల వారికి ఈ పథకం వర్తించాలని బీజేపీ కృషక్ మోర్చా నాయకులు ప్రశాంత్ పాలో అన్నారు. విశ్వకర్మ యోజన పథకం 18 కులాలు చేతివృత్తులు, హస్తకళాకారులకు వర్తింపజేయాలని అధికారులను కోరారు.

చేతివృత్తులకు చేయూత అందించాలి