పర్లాకిమిడి: మోహానా బ్లాక్ మలాస్పదర్ గ్రామపంచాయతీలోని ముఖహుర్ పర్వతం వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహం బయటపడింది. ఈ ముఖహుర్ పర్వతం వద్ద ఆంజనేయస్వామి, దుర్గా, శివలింగాలకు అక్కడి ప్రజలు చాలా కాలం నుంచి పూజలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని ఇక్కడి గిరిజనులు కోరుతున్నారు. తద్వారా తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆరు పంచాయతీల ప్రజలు కలెక్టర్ బిజయ కుమార్ దాస్ను మంగళవారం కలిసి వినతిని అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే మోహానా బీడీవో రాజీవ్ దాస్ను ఆ ప్రాంతం విశేషాలు, రోడ్డు నిర్మాణానికి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. కలెక్టర్ను కలిసిన వారిలో భలియాగుడ మాజీ జిల్లా పరిషత్ సభ్యులు రాజీవ్ మల్లిక్, హరిశ్చంద్ర మల్లిక్, పర్యాటక ప్రచారకుడు సుజ్ఞాణ్ సాగర్, గురుదేవ్ మల్లిక్, భల్లిగుడ నుంచి కలియా మల్లిక్, హోరుగుడ నుంచి సంతోష్ మల్లిక్లు ఉన్నారు.
కలెక్టర్ బిజయకుమార్ దాస్కు ఆరు పంచాయతీల ప్రజల విజ్ఞప్తి
ముఖహుర్ పర్వతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి
ముఖహుర్ పర్వతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి