
నేతలు దిగి వచ్చిన వేళ
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలు జనాలతో కలిసిపోతున్నారు. నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి వంచల గుమ్మ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ తీసుకోవడానికి ఆటోలో పంచాయతీ కార్యాలయం వచ్చారు. ఇది తెలిసి బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ఆమె ఆటో వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకి రూ.3000 పింఛన్ అందజేశారు. కాంగ్రెస్కు చెందిన కొరాపుట్ జిల్లా లక్ష్మపూర్ ఎమ్మెల్యే బందుగాం సమితిలో మారుమూల గ్రామాల్లో గిరిజనుల ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసు కుంటున్నారు.

నేతలు దిగి వచ్చిన వేళ