
భూముల కబ్జాపై కలెక్టర్కు ఫిర్యాదు
పర్లాకిమిడి: గుసాని సమితి తులసిపాడు గ్రామానికి పరశురాం మౌజా డాక్టర్ భంజిరి గ్రామంలో పదేళ్లుగా నివాసం ఉంటున్నారు. గిరిజనులు, పేదలు ఇళ్లను ఖాళీ చేయించి సుమారు 55 ఎకరాల భూములను కబ్జా చేశారంటూ జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్కు గుసాని జెడ్పీటీసీ సభ్యుడు యస్.బాలరాజు, భంజరి గ్రామస్థులు మంగళవారం ఫిర్యాదు చేశారు. డాక్టర్ భంజిరి భూములు పూర్వకాలం నుంచి మోటూరు వారి పేరుమీద ఉన్నాయి. అయితే అ భూములు రియల్ ఎస్టేట్స్, దళారులు ఏకంగా అమ్ముకోవాలని చూస్తున్నందుకు డాక్టర్ భంజిరి గ్రామస్తులు కలెక్టరేట్కు వచ్చి అధికారులను కలిశారు.
దీనిపై జిల్లా రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ అధికారులు తగు చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి దృష్టికి తీసుకువెళతామని గుసాని జెడ్పీటీసీ సభ్యుడు యస్.బాలరాజు విలేకరులతో అన్నారు.