
సంప్రదాయాలను కాపాడుకుందాం
రాయగడ: మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం అందరి కర్తవ్యమని రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు అన్నారు. స్థానిక సంస్కృతి మహిళా సంఘం ఆధ్వర్యంలో సొమవారం సాయంత్రం జరిగిన ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఒడిశా సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిళ్లని అన్నారు. మన భావితరాలకు అవి తెలిసేలా ఇటువంటి కార్యక్రమాలను మహిళా సంఘాలు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజో సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లొ గెలుపొందిన వారికి ముఖ్యఅతిథి నెక్కంటి బహుమతులను అందజేశారు. సంస్కృతి మహిళా సంఘం అధ్యక్షురాలు సుజాత పాలో, కార్యదర్శి సరస్వతి సాహు, కోశాధికారి సర్మిష్ట పాఢిల నేతృత్వంలో కార్యక్రమం జరిగింది.
రాజ్యసభ మాజీ సభ్యుడు భాస్కరరావు