లక్ష్మణ్‌ నాయక్‌ మెడికల్‌ కాలేజీలో మరోసారి ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ నాయక్‌ మెడికల్‌ కాలేజీలో మరోసారి ఉద్రిక్తత

Jun 18 2025 3:13 AM | Updated on Jun 18 2025 3:13 AM

లక్ష్మణ్‌ నాయక్‌ మెడికల్‌ కాలేజీలో మరోసారి ఉద్రిక్తత

లక్ష్మణ్‌ నాయక్‌ మెడికల్‌ కాలేజీలో మరోసారి ఉద్రిక్తత

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని సాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ప్రభుత్వ కళాశాలలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం కళాశాలలో దశమంత్‌పూర్‌ సమితి మాలి మండాగుడ గ్రామానికి చెందిన ధను హంతాల్‌ (35) కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అతనడికి కడుపులో నీరు తీయాలని వైద్యులు చెప్పారు. మూడు రోజులైనా నీరు తీయలేదు. దీంతో మధ్యాహ్నం ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల క్రితం వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆరుగురు రోగులు చనిపోయారనే వివాదం ఇంకా కొనసాగుతోంది. మరో సారి మరో మృతి చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వార్డుల తలుపులు మూసివేసి వారికి నచ్చజెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే నిమయ్‌ సర్కార్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement