
ప్రచార రథం ప్రారంభం
కొరాపుట్: ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు జయపూర్ పట్టణంలో మెయిన్ రోడ్డులో ప్రచార రథాన్ని మున్సిపల్ చైర్మన్ నరేంద్ర మహంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అక్కవరం స్రశ్య రెడ్డి మాఆ్లడుతూ మూడు రోజుల పాటు రథం పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి.సునీత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
యువతరం సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి
భువనేశ్వర్: యువతరం సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సమగ్ర సమాజ సంక్షేమం కోసం యువతరం ఉత్సాహం, శక్తి, సామర్థ్యాల్ని ప్రత్యక్షంగా ప్రయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. వివిధ విభాగాలలో ఉద్యోగాలకు అర్హత సాధించిన 964 మందికి సోమవారం ఉద్యోగ నియామక పత్రాల్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమను తాము ప్రజల సేవకులుగా భావించి, సామాన్య ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి, సమస్యలను పరిష్కరించడానికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సమాజం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అవినీతికి అతీతంగా విధులు నిర్వర్తించాలని హితవుపలికారు.

ప్రచార రథం ప్రారంభం