
రైల్వే ప్రాజెక్టుల వేగవంతంపై దృష్టి
మల్కన్గిరి: రైల్వే ప్రాజెక్టుల వేగవంతానికి అధికారులు కృషి చేయాలని నవరంగపూర్ ఎంపీ బోలభద్ర మాఝి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి కార్యకలాపాల సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టాంగులు, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, జిల్లా అదనపు ఎస్పీ తాపాన్ నారాయణ్ రోతో, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రతాప్ కొత్తపల్లి, జిల్లా అదనపు కలెక్టర్ వేద్భర్ ప్రధాన్, జిల్లా అబివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సభరో, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి తదితరులు పాల్గొన్నారు.

రైల్వే ప్రాజెక్టుల వేగవంతంపై దృష్టి