పార్థసారథి సేవలను గుర్తించి మద్రాస్ తెలుగు అకాడమీ, ముంబాయ్ తెలుగు సమతి, ఖరగ్పూర్ సాహిత్య సమితి, కళానిలయం వారి జాతీయ స్థాయి పురస్కారం, రాష్ట్ర సాంస్కృతిక సమితి పురస్కారం, అమ్మా కల్చరల్ ఆర్ట్స్ పురస్కారం, మువ్వగోపాల సాంస్కృతిక సమితి పురస్కారం లభించాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, వేదాంతం సత్యనారాయణ శర్మ వంటి మహనీయులు ఆశీస్సులు లభించడం విశేషం. కూచిపూడి కేవలం నృత్యకళకాదు, అది తెలుగు నేల మీద సంస్కృతికి ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని తరతరాలకు అందిచేందుకు తన వంతు కృషి చేస్తున్న వేదాంతం పార్థసారథి వంటి కళాకారులు చిరస్మరణీయులు


