మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ ప్లాంట్ను ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గతంలో ఉన్న కూలింగ్ వాటర్ ప్లాంట్ భక్తుల అవసరాలకు సరిపోకపోవడంతో అదనంగా మరో కూలింగ్ వాటర్ ప్లాంట ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం యోగాసనాలను ప్రారంభించారు. అ ఈనెల 21వ తేదీ వరకు యోగాసనాలు జరుగుతాయని వివరించారు.


