వైభవంగా ఘనరాగ పంచరత్న కీర్తనల గోష్టిగానం
విజయవాడకల్చరల్: సద్గురు సంగీత సభ, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జీవీఆర్ సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న 31వ త్యాగరాజస్వామి ఆరాధాన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. త్యాగరాజస్వామి రచించిన స్వరపరచిన ఘనరాగ పంచరత్న కీర్తనలు జగదానందకారక, దుడుకుగల, సాధించినే, కనకన రుచిరా, ఎందరో మహానుభావులు కీర్తనలను 200 మంది గాయకులు వాద్యకారుల సహకారంతో ఆలపించారు. వాగ్గేయకారుడు సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు, మోదుమూడి సుధాకర్, వేమూరి విశ్వనాథ్, గౌరీనాథ్, పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్, గాయత్రీ గౌరీనాథ్, అంజనా సుధాకర్, మల్లాది కార్తీక త్రివేణి పంచరత్న కీర్తనల గోష్టిగానంలో పాల్గొన్నారు. స్వరార్చన కార్యక్రమంలో భాగంగా విద్యావైద్యనాథ్, పసుమర్తి పావని, పసుమర్తి పవిత్ర, అచల శంకరనాథ్(వీణ), కొత్తపల్లి వందన, విష్ణుభోట్ల సోదరీమణులు, సీవీపీ శాస్త్రి, పోపూరి శ్రీరాం చరణ్, చిట్టా కార్తీక్, చిట్టా దీపక్ త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఆలపించడంతో సంగీత ఉత్సవాలు ముగిశాయి.
బెంజిసర్కిల్ వద్ద కారు దగ్ధం
పటమట(విజయవాడతూర్పు): తాడేపల్లి నుంచి కానూరు వస్తున్న ిఓ కారు బెంజిసర్కిల్ వద్దకు రాగానే మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయటంతో ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానూరుకు చెందిన పాకనాటి గౌతమ్రాజ్ కానూరు మెయిన్రోడ్డులో ఉన్న పీఆర్ హాస్పిటల్స్లో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆదివారం తాడేపల్లిలో వ్యక్తిగత పని ముగించుకుని తన ఈవీ(ఎలక్ట్రికల్ వెహికల్) కారులో ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో బెంజిసర్కిల్ దాటిన తర్వాత సర్వోత్తమ గ్రంథాలయ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి కారులో పొగలు రావటం చూసి స్థానికులు గౌతమ్రాజ్ను అప్రమత్తం చేశారు. వెంటనే కారును పక్కన ఆపి కారు దిగాడు. అదే సమయంలో మంటలు పెద్దగా వ్యాపించటంతో స్థానికులు ఆటోనగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.
వైభవంగా ఘనరాగ పంచరత్న కీర్తనల గోష్టిగానం
వైభవంగా ఘనరాగ పంచరత్న కీర్తనల గోష్టిగానం


