విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jun 20 2025 5:22 AM | Updated on Jun 20 2025 5:22 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025
పడకేసిన ప్రాథమిక వైద్యం
ఆర్టీసీ చలో వైజాగ్‌!

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం.

తల్లిదండ్రుల ఆందోళన

జగ్గయ్యపేట: చిల్లకల్లులోని ఎంఈవో కార్యాలయం వద్ద గురువారం ఎంపీ స్కూల్స్‌లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు తొలగించటంపై తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

దుర్గమ్మ సన్నిధిలో కలెక్టర్‌

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు.

జి.కొండూరు: తాను ప్రభుత్వ అధికారినంటూ ఎన్టీఆర్‌ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలో ఉండే కుప్పిరెడ్డి కృష్ణారెడ్డికి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం సమయంలో సైబర్‌ నేరగాడి నుంచి ఫోన్‌ వచ్చింది. మీ గ్రామ వలంటీర్‌ కొప్పుల దివ్య ఎలా పని చేశారు? మీకు గతంలో అమ్మ ఒడి డబ్బులు ఏమైనా పెండింగ్‌ ఉన్నాయా? అని కృష్ణారెడ్డిని అడిగారు. గతంలో ఏమీ పెండింగ్‌లో లేవని చెప్పడంతో ఇప్పుడు మీకు తల్లికి వందనం డబ్బులు పడతాయి, మీ ఫోన్‌పే ఓపెన్‌ చేసి నేను ఒక నంబరు చెప్తాను.. ఆ నంబరుకు రూ.20వేలు పంపించండి అని సదరు సైబర్‌ నేరగాడు చెప్పాడు. వెంటనే కృష్ణారెడ్డి తన ఫోన్‌పే నుంచి సదరు సైబర్‌ నేరగాళ్లు చెప్పిన అకౌంట్‌ నంబరుకు రూ.5వేలు చొప్పున రెండు దఫాలుగా పదివేలు, మరొక ఫోన్‌ నుంచి రూ.10 వేలను రెండు దఫాలుగా పంపించారు. ఆ తర్వాత సదరు సైబర్‌ నేరగాడికి ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. వెంటనే అనుమానం వచ్చి ఫోన్‌పే ఓపెన్‌ చేయగా సైబర్‌ నేరగాడి అకౌంట్‌ వివరాలు కూడా కనిపించకపోవడంతో మోసపోయానని తెలుసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కొప్పుల వెంకట్రామిరెడ్డి నుంచి కూడా ఇదే రీతిలో రూ.9 వేలను సైబర్‌ నేరగాడు లాగేసుకున్నాడు. దీంతో చేసేది లేక ఇద్దరు బాధితులు జి.కొండూరు ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ని సంప్రదించారు. బాధితులతో సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌తో పాటు ఫోన్‌పేకు ఎస్‌ఐ ఫిర్యాదు చేయించారు.

వలంటీర్లను పావులుగా వాడుకుంటూ..

ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేసే 12వ తేదీని సైబర్‌ నేరగాళ్లు నేరం చేసేందుకు అనువుగా ఎంచుకున్నారు. అనుకున్న ప్రకారం ముందుగా జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్లకు ఫోన్‌ చేసి మిమ్మల్ని గ్రామ వలంటీర్లుగా మళ్లీ తీసుకుంటున్నాం. ఎక్కువ జీతం కూడా వస్తుంది అని నమ్మబలికారు. మీ దగ్గర గతంలో అమ్మ ఒడి పొందిన లబ్ధిదారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ఇవ్వాలంటూ అడిగారు. దీంతో సదరు గ్రామ వలంటీర్లు వారి దగ్గర ఉన్న పేర్లు, ఫోన్‌ నంబర్లను ఇచ్చారు. ఇక అక్కడి నుంచి నేరగాళ్లు వ్యూహాత్మకంగా మోసానికి పాల్పడ్డారు. అయితే బాధితులు చెబుతున్న ప్రకారం సదరు సైబర్‌ నేరగాడు ఇచ్చిన అకౌంట్‌ నంబరు కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు చెందినదిగా తెలుస్తోంది. అయితే చివరి నాలుగు నంబర్లు 9841 తప్ప మరేమీ కనిపించడంలేదని అంటున్నారు.

I

న్యూస్‌రీల్‌

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు రచిస్తూ అమాయక గ్రామీణులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా తల్లికి వందనం లబ్ధిదారులు టార్గెట్‌గా పన్నిన వ్యూహంలో గతంలో పనిచేసిన వలంటీర్లను కూడా పావులుగా వాడుకోవడం గమనార్హం. జి.కొండూరు మండలంలో ఈ విధంగా మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంకా పరువు పోతుందని ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రానివి మరెన్నో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరగాళ్లతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ పథకాల పేరుతో లబ్ధిదారులకు ఫోన్‌ చేసి వివరాలు అడిగినా, డబ్బులు పంపమన్నా స్పందించవద్దు. ఎటువంటి అనుమానిత ఫోన్‌ కాల్స్‌ వచ్చినా 1930కి కానీ స్థానిక పోలీసుస్టేషన్‌కు కానీ ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే వెంకటాపురంలో జరిగిన మోసంపై సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌, ఫోన్‌పే వారికి ఫిర్యాదు చేయించాం. ప్రజలందరినీ సోషల్‌ మీడియా ద్వారా అప్రమత్తం చేశాం.

–సతీష్‌కుమార్‌,

ఎస్‌ఐ, జి.కొండూరు

తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయంటూ లబ్ధిదారులకు ఫోన్‌లు మాటలతో నమ్మించి ఫోన్‌పే నుంచి డబ్బులు లాగేసుకున్న సైబర్‌ నేరగాళ్లు వెంకటాపురంలో ముగ్గురు బాధితుల నుంచి రూ.44వేలు హాంఫట్‌ ఫోన్‌పే, సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

ఇంటి నంబరు మార్పు సమస్య

అని చెప్పి..

ఇదే గ్రామానికి చెందిన అయిలూరి వెంకట్రామిరెడ్డికి ఇంటి నంబరు మార్పు సమస్య ఉంది. అయితే వెంకట్రామిరెడ్డికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు ఇంటి నంబరు సమస్యను సైతం ప్రస్తావించాడు. తర్వాత మీ గ్రామ వలంటీరు పనితీరు ఎలా ఉంది అని అడిగి నమ్మబలికాడు. అనంతరం గ్రామ వలంటీరు గోపిరెడ్డిని ఫోన్‌ కాన్ఫరెన్స్‌ కలిపి తల్లికి వందనం డబ్బులు గురించి మాట్లాడుతారు అని వలంటీరుతో చెప్పించాడు. ఆ తర్వాత వలంటీరును హోల్డ్‌లో పెట్టిన సైబర్‌ నేరగాడు తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లోకి రావాలంటే మీరు కొంత డబ్బులు పంపాలని నంబరు చెప్పాడు. నిజమే అని నమ్మిన వెంకట్రామిరెడ్డి సైబర్‌ నేరగాడు చెప్పిన అకౌంట్‌ నంబరుకు రూ.5వేలు చొప్పున మూడు దఫాలుగా రూ.15వేలు పంపాడు. తర్వాత మోసపోయానని తెలుసుకుని పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా తన అకౌంట్‌ని క్లోజ్‌ చేయించాడు. వెంకటాపురం గ్రామానికి చెందిన ఈ ముగ్గురు బాధితులే కాకుండా తల్లికి వందనం లబ్ధిదారులు భారీగానే మోసపోయినట్లు తెలుస్తోంది. పరువు పోతుందనే భయంతోనే బాధితులు ఫిర్యాదు చేసేందుకు కూడా రావడం లేదని తెలుస్తోంది.

విజయవాడ సిటీ1
1/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/8

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement