
జీవన విధానంలో యోగా ఒక భాగం
పాలిసెట్ హెల్ప్లైన్ సెంటర్గా గుడ్లవల్లేరు
అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రాకు తొలి అడుగు యోగాంధ్ర అని చెప్పారు. 30 రోజులుగా జిల్లాలో గ్రామగ్రామాన, పట్టణాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శరీరంలోని అన్ని వ్యవస్థలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చే శక్తి యోగాసనాలకు ఉందని పేర్కొన్నారు. ఒత్తిడిని మన జీవితంలోకి అడుగుపెట్టనివ్వకుండా యోగాసనాలు రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రతిరోజూ యోగాంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, ఎన్సీసీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.రమేష్, ఫిజికల్ డైరెక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మూలపాడు(ఇబ్రహీంపట్నం):వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మూలపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన మాకాని ఆదెయ్య (48) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో మూడురోజుల క్రితం అప్పులు ఇచ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆదెయ్య పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి జారిన అదెయ్యను విజయవాడ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య, వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
గొంతు కోసుకొని....
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో చోటుచేసుకుంది. బెల్లంకొండ నాగేశ్వరరావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిని తిరుపతమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య తిరుపతమ్మ పిల్లలను భర్త వద్ద వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లల సంరక్షణ చూసుకుంటున్న నాగేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాకుతో గొంతు కోసుకున్నాడు. పనులకు వెళ్లి వచ్చిన అతని తల్లి రక్తస్రావం కావడం గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందాడు. మృతుడి తల్లి వెంకట్రావమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వేధింపులు తాళలేక వివాహిత...
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):భర్త, ఆత్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఔట్ ఏజెన్సీకి చెందిన వినిత (27) ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. డిప్లొమా చదివే రోజుల్లో అదే ప్రాంతానికి చెందిన సుజిత్కుమార్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడి 2018లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం భర్త వేధించసాగాడు. వినిత కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా చక్కగా కాపురం చేస్తానని అంగీకరించాడు. అనంతరం వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మరలా భర్త, అత్త వేధింపులు మొదలయ్యాయి. దీంతో గత ఆరు నెలలుగా భర్త నుంచి విడిగా ఉంటూ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వినిత అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. భర్త, అత్త వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్రాసి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వినిత తల్లి విజయలక్ష్మి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
వరి విత్తనాల సరఫరాలో
ప్రభుత్వం విఫలం
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్
తోట్లవల్లూరు: రైతులకు వరి విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ విమర్శించారు. మండలంలోని గరికపర్రులో గురువారం ఆయన పర్యటించారు. గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి విత్తనాలు దొరకడం లేదని, బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు కై లే దృష్టికి తీసుకువచ్చారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందించడం జరిగిందని అనిల్కుమార్ గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాల పేరు మార్చడమే కాకుండా వాటిని రైతులకు సేవలందించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. విత్తనాలు దొరకక రైతులు వ్యాపారులు, రైస్మిల్లర్లను ఆశ్రయించే పరిస్థితులు దాపురించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రైతుల అవసరాలకు తగినట్లుగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని అనిల్కుమార్ డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ కళ్లం శివారెడ్డి, సర్పంచ్లు బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడిశెట్టి ఉదయభాస్కర్, నాయకులు నడకుదురు రాజేంద్ర, చింతలపూడి గవాస్కర్రాజు, చింతలపూడి సుబ్బారావు, మైనేని వేమూరి కృష్ణబాబు, తారాచంద్, బోలెం చంటి పాల్గొన్నారు.
మోపిదేవిలో కలెక్టర్ బాలాజీ పర్యటన
మోపిదేవి: మండలంలో పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం తనిఖీలు నిర్వహించారు. మోపిదేవి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. బాత్రూముల డోర్లు పర్మినెంట్గా ఉండేవి ఏర్పాటు చేయాలని, త్వరితగతిన భవన నిర్మాణం పూర్తిచేయాలని అదికారులకు సూచించారు. రావివారిపాలెంలో పీహెచ్సీని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మందుల విభాగాన్ని, ప్రయోగశాలను తనిఖీ చేశారు. గదులు చాలక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఎంపీపీ దుర్గావాణి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పాముకాటుకు విరుగుడు మందు, రాబిస్ వ్యాధి మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంకటాపురంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించి భూ రీ సర్వేపై గ్రామస్తులతో మాట్లాడారు. 11/1 కాలువ చివరలో పూర్తిగా పూడుకు పోయినందున కాలువ చివరి భూములకు నీరు అందడం లేదని పలువురు రైతులు కలెక్టర్కు తెలిపారు. స్థానిక జెడ్పీపాఠశాల, ఆంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం కలిగిన ఆహారం అందించాలని ఆదేశించారు. ఎంపీపీ రావి దుర్గావాణి, అదనపు డీఎంహెచ్వో వెంకటరావు, తహసీల్దార్ శ్రీవిద్య, ఎంపీడీవో స్వర్ణభారతి, సీహెచ్సీ డాక్టర్లు అనిల్కుమార్, లక్ష్మీనాఽథ్, వార్డెన్ నాగలక్ష్మీ, మాజీ సర్పంచ్ అబ్బూరి నాంచారయ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
రాజధానిలో మొక్కలకు డ్రోన్లతో వర్మీవాష్
తాడికొండ: రాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు, మొక్కలకు పోషకాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు తెలిపారు. ప్రధాన అనుసంధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డుపై 10 కిలోమీటర్ల మేర పూల మొక్కలకు డ్రోన్ల ద్వారా వర్మీవాష్ చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఆర్గానిక్ పోషకాలను మొక్కలకు అందించడానికి ఈ పద్ధతి తోడ్పడుతుందని చెప్పారు.
గుడ్లవల్లేరు:ఏపీ పాలీసెట్ – 2025 ధ్రువ పత్రాల పరిశీలన హెల్ప్లైన్ సెంటర్గా ఎ.ఎ.ఎన్.ఎమ్ – వి.వి.ఆర్.ఎస్.ఆర్. పాలిటెక్నిక్ కాలేజీని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ గురువారం విలేకర్లకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలీసెట్ – 2025 ఫలితాల ప్రకటన అనంతరం ఏటా మాదిరిగానే ఈసారి కూడా గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ను ఏపీ పాలీసెట్ – 2025 కౌన్సెలింగ్ హెల్ప్లైన్ సెంటర్గా ప్రకటించారన్నారు. ఈ అవకాశాన్ని గుడ్లవల్లేరు గ్రామా పరిసర ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. పాలీసెట్ – 2025 లో ర్యాంకును సాధించి ధ్రువ పత్రాల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థులు ముందుగా ఈ నెల 20 నుంచి 27వ తేదీ లోపు ఓసీ/బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.250 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా కింద తెలిపిన తేదీల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్లో జరిగే ధ్రువ పత్రాల పరిశీలన ప్రక్రియలో తమ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చన్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులకు జూలై 3న అలాట్మెంట్స్ వస్తాయని పేర్కొన్నారు.
విజయవాడలీగల్:బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్ట్ న్యాయాధికారి వి.భవాని తీర్పు చెప్పారు. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే వ్యక్తి వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య టీచర్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకునే సమయంలో భద్రాది కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ఏరియాకు చెందిన బొల్లవరపు ప్రసాద్ అనే వ్యక్తి పరిచయమై ఇంట్లో మనిషిగా ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఉపాధ్యాయురాలి కుమార్తె పదో తరగతి చదువుతున్నది. కొద్ది రోజులుగా బాలిక ఎవ్వరితో మాట్లాడకుండా ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు కారణం అడగ్గా ఇంట్లో
ఒంటరిగా ఉన్న సమయంలో ప్రసాద్ అంకుల్ ఎక్కడపడితే అక్కడ అసభ్యకరంగా తాకుతూ, ఎవరికై నా చెపితే మీ అమ్మ నాన్నలను చంపుతాను అని చెప్పి బెదిరించాడని చెప్పింది. దీంతో ఈ సంఘటనపై మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2019 మే 30వ తేదీన నిందితుడైన బొల్లవరపు ప్రసాద్ న్యాయస్థానం నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. అనంతరం పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేశారు. ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కృష్ణవేణి, సి.యం.ఎస్. ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, అప్పటి మాచవరం ఎస్ఐ రమేష్, మహిళా ఎస్ఐ.అనూష, సిఎంయస్ సిబ్బంది పర్యవేక్షణలో 8 మంది సాక్షులను విచారించారు. బొల్లవరపు ప్రసాద్పై నేరం రుజువైనందున గురువారం పోక్సో కోర్టు న్యాయాధికారి వి.భవానీ నిందితుడికి మూడేళ్ల శిక్షతో పాటు జరిమానా విధించారు.
జిల్లాలోని 4,470 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు
చిలకలపూడి(మచిలీపట్నం):అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 4,470 ప్రదేశాల్లో ఈ నెల 21వ తేదీన యోగా కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధిలో యోగా కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న పౌరులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడిగడప, ఉయ్యూరు మునిసిపాల్టీల్లో, బంటుమిల్లి, మొవ్వ, నాగాయలంక మండలాల్లో శిక్షణా తరగతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తామని అక్కడ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా అదే రోజు నిర్వహించాల్సి ఉన్నందున యోగా కార్యక్రమం పూర్తయిన తరువాత పరిసరాలను శుభ్రం చేయాలని చెప్పారు. మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛాంధ్ర పై యోగా, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలన్నారు. జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, డీఈవో పీవీజె రామారావు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
నిమ్మకూరు(పామర్రు): యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధించవచ్చని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం. ఫణి ధూర్జటి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో గురువారం గురుకుల పాఠశాల, కళాశాల, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో శారీరక రుగ్మతలు దూరం అవుతాయని చెప్పారు. ప్రతి రోజూ వ్యాయామం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. యోగ గురువు ముదిగొండ శాస్త్రి ఆధ్వర్యంలో స్వల్ప, సులభతర, వ్యాయామం, భ్రమర కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో నిర్వహించిన ఈ యోగ శిక్షణలో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం ప్రముఖులను ఎస్వైఎల్ఎన్ ఆచార్యులు, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కన్వీనర్ తురగా ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ తాండవ శిక్షణ, అన్నదాన కమిటీ సభ్యులు ఎ. నెలబాలుడులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.జ్యోతి, ఎంఈఓ – 2 గుమ్మడి పద్మవాణి, పాఠశాల హెచ్ఎం ఎం.లక్ష్మీలత, గ్రామసర్పంచ్ పి. దుర్గా శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఎం.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ
జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణి ధూర్జటి

జీవన విధానంలో యోగా ఒక భాగం

జీవన విధానంలో యోగా ఒక భాగం