
ఆంధ్రా హాస్పిటల్లో ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ క్యాంప్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) ఉచిత వ్యాక్సినేషన్ క్యాంప్ సినీహీరో మహేష్బాబు సహకారంతో ఆంధ్రా హాస్పిటల్లో ప్రారంభమైంది. ఈ క్యాంప్ను సోమవారం ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, ఫీటల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ పాతూరి పద్మలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్బాబు ఫౌండేషన్ సహకారంతో తమ ఆస్పత్రిలో తొమ్మిదేళ్ల నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలకు మూడు డోసులను ఉచితంగా ఇస్తామన్నారు. ఈ వ్యాక్సిన్ మూడు డోసులు రూ.6 వేలుగా పేర్కొన్నారు. మహేష్బాబు ఫౌండేషన్ రూ.40 లక్షల సహకారంతో ఈ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదపడుతుందని వైద్యులు రామారావు, పద్మ తెలిపారు.