హనుమాన్‌ శోభాయాత్రను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ శోభాయాత్రను విజయవంతం చేయండి

Apr 20 2025 2:11 AM | Updated on Apr 20 2025 2:11 AM

హనుమాన్‌ శోభాయాత్రను విజయవంతం చేయండి

హనుమాన్‌ శోభాయాత్రను విజయవంతం చేయండి

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ సమాజానికి ధైర్య సాహసాలను ఇచ్చే హనుమాన్‌ శోభాయాత్ర (బైక్‌ ర్యాలీ)ను విజయవంతం చేయాలని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. వచ్చేనెల 22న విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరగబోయే శోభాయాత్ర స్టిక్కర్‌, పోస్టర్‌ విడుదల కార్యక్రమం మాచవరం దాసాంజనేయస్వామి దేవాలయంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శివస్వామి పాల్గొని వీహెచ్‌పీ కేంద్రీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, వీహెచ్‌పీ ప్రాంత కోశాధికారి దుర్గాప్రసాద్‌ రాజు, వీహెచ్‌పీ విజయవాడ మహానగర్‌ అధ్యక్షులు సానా శ్రీనివాస్‌తో కలిసి బైక్‌ స్టిక్కర్‌, వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. విశ్వ హిందూ పరిషత్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement