నిజామాబాద్ లీగల్: కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కే సులకు సంబంధించి కక్షిదారులకు సత్వర న్యా యం అందించేందుకు ఈనెల 28వ తేదీన లోక్అ దాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి తెలిపారు. లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసులు కృషి చేయాలని కోరారు. జిల్లా కోర్టులో మంగళవారం స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించగా.. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిలు హరీష, టి శ్రీనివాస్, డీసీపీ బస్వారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భారతలక్ష్మి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసు కునేలా కృషి చేయాలన్నారు.


