కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ బొదిరే నాగమణి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సభ్య సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలను కమిషనర్ గోపు గంగాధర్ ప్రస్తావించారు. అంశాలపై కౌన్సిలర్లు చర్చించి ఆమోదం తెలిపారు. వైస్ చైర్పర్సన్ సంటి లత, కౌన్సిలర్లు కుశలత, సతీశ్, గున్నా ల బాలలక్ష్మి, బొదిరే లావణ్య, అంజుమ్ అలీ, సందీప్, నీలం రవి, సంగ్యానాయక్, మల్లెల అనుపమ, మేనేజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


