
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా శ్యాంబాబు నియామకం
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది ముత్యాల శ్యాం బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు విడుదల చేశారు. శ్యాంబాబు స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులవడంపై నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్ రాజ్, ప్రభుత్వ న్యాయవాది అమిడాల సుదర్శన్తోపాటు సీనియర్ న్యాయవాదులు నరసింహారెడ్డి, సురేశ్, మధ్యపల్లి శంకర్, నరేశ్, గంగాప్రసాద్, ఆశనారాయణ, అన్వే ష్, శ్రీమన్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శ్యాంబాబును సన్మానించారు.