ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

Jun 27 2025 4:14 AM | Updated on Jun 27 2025 4:14 AM

ఇందిర

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

సిరికొండ: మండలంలోని వర్జన్‌తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు మోజీరాం గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో పేదవాడు సొంత ఇళ్లు కలగానే మిగిలిపోయిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేసి గూడు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శికి సన్మానం

నిజామాబాద్‌ సిటీ: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన చిన్నబ్బు రాంభూపాల్‌ను కాంగ్రెస్‌ నాయకులు కలిశారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఎస్టీసెల్‌ నగర అధ్యక్షుడు సుభాష్‌ జాదవ్‌ రాంభూపాల్‌ను శాలువా కప్పి సత్కరించారు. టీపీసీసీలో ఇందూరుకు ప్రాతినిధ్యం లభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్మిక నాయకుడు

డీవీ కృష్ణకు ఘన నివాళులు

నిజామాబాద్‌ సిటీ: కార్మిక ఉద్యమాల నాయకుడు ప్రజాపంథా రాష్ట్ర మాజీ కార్యదర్శి డీవీ కృష్ణ వర్ధంతిని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ (ప్రజాపంథా) నిజామాబాద్‌ అర్బన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురు వారం నిర్వహించిన వర్ధంతి సభలో డీవీ కృష్ణ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. డీవీకే 50 యేళ్లు విప్లవోద్యమాలను నిర్మించారని, జిల్లాలో బీడీ కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం నరేందర్‌, ఎం వెంకన్న, డి రాజేశ్వర్‌, ఎం సుధాకర్‌, కె గంగాధర్‌, బి మల్లేశ్‌, సీహెచ్‌ సాయన్న, డి కిషన్‌, బి మురళి, పి సాయన్న, వి గోదావరి, కె సంధ్యారాణి, కె గణేశ్‌, సాయిబాబా, కిరణ్‌, రవి, గంగారాం, చరణ్‌, రమేశ్‌, శకుంతల, నర్సక్క, అమూల్య, మంజుల, గంగాధర్‌, మల్లవ్వ మహిపాల్‌, సృజన్‌, శాంతి కుమార్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

ఇంజినీరింగ్‌ కళాశాలను

ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని పీడీఎస్‌ యూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్‌ మెమోరియల్‌ లైబ్రరీలో పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సమావేశం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌ గౌతం కుమార్‌, జన్నారపు రాజేశ్వర్‌, ప్రిన్స్‌, దేవిక, నిఖిల్‌, సాయినాథ్‌, హుస్సేన్‌, శ్రీకాంత్‌ తదితదిరులు పాల్గొన్నారు.

నియామకం

జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్‌ గ్రామానికి చెందిన మాసం లక్ష్మీనర్సు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ యాదవ్‌, మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి యాదవ్‌ చేతుల మీదుగా ఆమె నియామకపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ  పనులు ప్రారంభం 
1
1/4

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ  పనులు ప్రారంభం 
2
2/4

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ  పనులు ప్రారంభం 
3
3/4

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ  పనులు ప్రారంభం 
4
4/4

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement