
జిల్లా కేంద్రంలో ప్రత్యేక పారిశుధ్య పనులు
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా జిల్లా కేంద్ర పర్యటన సందర్భంగా నగరంలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. అమిత్ షా ఈనెల 29న నగరానికి రానున్న విషయం తెలిసిందే. కంఠేశ్వర్ బైపాస్ వద్ద దివంగత డి శ్రీనివాస్ విగ్రహ ప్రతిష్ట జరగనుంది. దీంతో సర్కిల్–1, సర్కిల్–4ఏ కు చెందిన పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. కంఠేశ్వర్ బైపాస్ నుంచి కొత్త కలేక్టరేట్ వరకు, చంద్రశేఖర్ కాలనీ, గౌతంనగర్, పాలిటెక్నిక్ మైదానం మొత్తం శుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించారు. వినాయక్నగర్లోని పసుపుబోర్డు నూతన కార్యాలయ పరిసరాలు కూడా శుభ్రం చేయించారు. ఏఎంసీ జయకుమార్, సూపర్వైజర్ సాజిద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సునీల్, శ్రీకాంత్, షాదుల్లాలు పనులను పరిశీలించారు.