
అసంపూర్తిగా డివైడర్ల నిర్మాణం
నిజామాబాద్నాగారం: నగరంలోని ప్రధాన రహదారుల మధ్యలో డివైడర్ల నిర్మాణం చేపట్టారు.. నలువైపులా పనులు పూర్తి చేశారు. కాగా, ఆర్మూర్ రోడ్లోని ముబారక్నగర్ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ ప్రియనగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ కాలనీ చౌరస్తా మీదుగా సుక్జిత్ ఫ్యాక్టరీ వరకు డివైడర్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేశారు. డాదిన్నరగా అధికారులు పర్యవేక్షణ లేకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. డివైడర్ల పనులు పూర్తి కాగానే చెట్లు పెంచాలి. వాహనాలు వెళ్తుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశ్యంతో పచ్చదనంతో కూడిన చెట్లు పెంచుతున్నారు. కంఠేశ్వర్ మీదుగా సుజిత్ ఫ్యాక్టరీ వరకు ఆర్మూర్ రోడ్లో డివైడర్ల నిర్మాణ పనులు అంతంత మాత్రంగానే చేపట్టారు. సుమారు ఒక్క కిలోమీటర్ మేర పొడవు ఉన్న డివైడర్ అధ్వానంగా మారుతోంది. ఎక్కడిక్కడ డివైడర్లు ధ్వంసమవుతున్నాయి. నిర్మాణ పనులు సైతం మధ్యలోనే ఆపేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన డివైడర్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ అనారోగ్యానికి గురయ్యాడని త్వరలోనే పనులు పూర్తి చేయిస్తానని అప్పటి ఈఈ సురేష్ తెలిపారు. ఏడాదిన్నర గడిచినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
నగరంలో శ్రీ లక్ష్మీప్రియనగర్
నుంచి సుక్జిత్ ఫ్యాక్టరీ వరకు
పర్యవేక్షణ చేయని అధికారులు
త్వరగా పనులు పూర్తి చేయాలి
రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. డివైడర్లలో చెట్లు పెంచితే బాగుంటుంది. రాత్రుల్లో కూడా లైటింగ్ ఏర్పాటు చేయాలి. డివైడర్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి.
–కృష్ణ, వాహనదారుడు, ముబారక్నగర్
మా పరిధి మేరకు పనులు పూర్తి చేశాం
డివైడర్ల పనులకు సంబంధించి కాంట్రాక్టర్కు స్ట్రోక్ రావడంతో పనుల్లో కాస్త ఆలస్యమైంది. పనులు మాత్రం పూర్తి చేశాం. కాంట్రాక్టర్కు ఇప్పటి వరకు బిల్లులు కూడా రాలేదు. మా పరిధిలో ఉన్న పనులు మాత్రం పూర్తి చేయించాం.
– సాయికుమార్, ఆర్అండ్బీ ఏఈ

అసంపూర్తిగా డివైడర్ల నిర్మాణం

అసంపూర్తిగా డివైడర్ల నిర్మాణం