
యూరియా అవసరం మేరకే వాడాలి
● డీఏవో వీరస్వామి
మోపాల్(నిజామాబాద్రూరల్): రైతాంగం అవసరం మేరకే యూరియా వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) వీరస్వామి పే ర్కొన్నారు. మోపాల్ సొసైటీలో యూరియా నిల్వలు, యూరియా పంపిణీ చేసేవిధానం, తదితర అంశాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వీరస్వామి మా ట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 5.35 లక్ష ల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వే శామన్నారు. వర్ని, మోస్రా, చందూర్, బోధ న్ సహా పలు మండలాల్లో వరినాట్లు ప్రారంభమైనట్లు తెలిపారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడ కూడా కొరత లేదని పేర్కొన్నారు. యూరి యా కొరతపై దుష్ప్రచారాలను నమ్మొద్దని, రైతులు యూరియా నిల్వలు పెట్టుకొని కృత్రిమ కొరతను సృష్టించొద్దని సూచించారు. జిల్లాలో అధికంగా యూరియా వినియోగిస్తున్నారని, దీంతో పంట తెగుళ్ల బారినపడే అ వకాశముందని పేర్కొన్నారు. ఆయన వెంట ఏవో సౌమ్య, సొసైటీ సీఈవో సాయిచంద్ తదితరులు ఉన్నారు.