
దోమల నివారణే మనందరి లక్ష్యం
నిజామాబాద్ నాగారం: దోమల నివారణే మనందరి లక్ష్యమని, దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగీ, చికున్గున్యా, ఫైలేరియా, మెదడువాపు లాంటి వ్యాధులను అరికట్టాలని డీఎంహెచ్వో రాజశ్రీ సిబ్బందికి సూచించారు. నగరంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం ప్రపంచ మలేరి యా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతి రోజు గృహ సందర్శనలో ఏ రకమైన జ్వరం అయి నా రక్తనమూనాలు సేకరించి, మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. జిల్లా కీటకజనీత వ్యాధుల నియంత్రణ అధికారి తుకారం రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా ఒక్క మలేరియా కేసు నమోదు కాలేదని, మ లేరియా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యాధికారులు శ్రీలత, సుసేన, శిఖరా, చంద్రకళ, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మహమ్మద్ సలీం, గోవర్ధన్, నటరాజ్, సంతోష్, లింగారెడ్డి, నాగరాజు, శాంతాకుమారి, స్వామి, మధుసూదన్ పాల్గొన్నారు.