
సెలవులొచ్చాయి.. పిల్లలు జాగ్రత్త!
ఖలీల్వాడి: ఇంటర్, పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. గురువారం నుంచి పాఠశాలలకూ సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో పిల్లలు ఇంటి పట్టున ఉండేందుకు ఇష్టపడరు. మధ్యాహ్నం వేళలో ఆటలాడుతూ ఎండదెబ్బకు గురయ్యే ప్ర మాదం ఉంది. సరదాగా స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదాలబారిన పడే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో పిల్లల కదలికలపై ఓ కన్నేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
బండి ఇవ్వొద్దు.. బాధపడొద్దు
పిల్లలకు ద్విచక్రవాహనాలు ఇచ్చిన రోడ్లపై తిరుగనివ్వొద్దు. రోడ్డు ప్రమాదాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రమాదం సంభవిస్తే పిల్లలతోపాటు తల్లిదండ్రులు, వాహన యజమానికి కోర్టు శిక్ష విధించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే మైనర్ డ్రైవ్ కేసులు మొదలయ్యాయి.
ఆడపిల్లలను ఎక్కడా ఉంచొద్దు..
ఆడపిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. టీనేజీ పిల్లలను స్నేహితులు, తెలిసిన వారి ఇండ్ల వద్ద ఉంచొద్దు. ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు దృష్టిసారించాలి. గారాబం చేయకుండా వారికి అర్థమయ్యేలా ప్రేమతో చెప్పాలి.
ఈతతో జాగ్రత్త..
పిల్లలు సరదాగా స్నానం చేసేందుకు చెరువులు, కా లువలు, బావుల వద్దకు వెళ్లాలని యోచిస్తారు. స్నా నం కోసం బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు జా గ్రత్త పడాలి.ఈత నేర్పించాలనుకుంటే మాత్రం తగిన శిక్షకుడు ఉండే స్విమ్మింగ్ పూల్కు పంపించండి.
స్నేహితులెవరో తెలుసుకోండి..
పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు.. వారికి ఉన్న అలవాట్లను తెలుసుకోవాలి. చెడు స్నేహాలతో బైక్లపై తిరగడం, సిగరెట్లు, మద్యం అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది. వ్యసనాలకు బానిసై గొడవలు, దొంగతనాలు చేసే అవకాశాలుంటాయి. దీంతో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది.
సెల్ఫోన్కు బానిసలను చేయొద్దు
చాలా మంది పిల్లలు సెల్ఫోన్లలకు బానిసలవుతున్నారు. సెలవుల్లో ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఫోన్లతోనే గడుపుతారు. దీంతో పిల్లల్లో చురుకుదనం తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. సెల్ఫోన్లకు బదులు ఆరుబయట ఆటలపై శ్రద్ధ కనబర్చేలా ఏర్పాట్లు చేయాలి. సెల్ వాడకంతో ఆన్లైన్లో వచ్చే గేమ్స్ ఆడి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది.