మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా | - | Sakshi
Sakshi News home page

మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

Apr 19 2025 9:44 AM | Updated on Apr 19 2025 9:44 AM

మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

సిరికొండ: సిరికొండ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా మారుస్తానని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. తాటిపల్లిలో రెండున్నర కోట్ల రూపాయలతో సబ్‌ స్టేషన్‌, చీమన్‌పల్లిలో రూ.2 కోట్లతో పీహెచ్‌సీ, కుర్దుల్‌పేట్‌లో రూ.20 లక్షలతో జీపీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేసి మైలారంలో సీసీ రోడ్లను ప్రారంభించారు. చీమన్‌పల్లి, తాటిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చీమన్‌పల్లి గ్రామస్తుడైన మాజీ ఎమ్మెల్యేను 40 ఏళ్లుగా సర్పంచ్‌, ఎంపీపీ, ఎమ్మెల్యేగా గెలిపించినా ఈ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. బ్యాంకు ఏర్పాటు చేయిస్తానని, చెక్‌డ్యాంలు మంజూరు చేయిస్తానని తెలిపారు. తాటిపల్లికి వెళ్లే మార్గంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని, నిధులు త్వరలోనే మంజూరవుతాయని చెప్పారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్‌, డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీసీసీ కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, ఎర్రన్న, చందర్‌నాయక్‌, ఉమ్మాజీ నరేష్‌, మండలాధ్యక్షుడు బాకారం రవి, సొసైటీ చైర్మన్‌ గంగాధర్‌, బాకారం సంతోస్‌, దేగాం సాయన్న, రాజారెడ్డి, రవినాయక్‌, సంతోష్‌నాయక్‌, బన్నాజీ, అంబర్‌సింగ్‌, నర్సింగ్‌, నర్సారెడ్డి, ప్రసాద్‌, బాల్‌రాజ్‌నాయక్‌, లింగారెడ్డి, లక్ష్మణ్‌, శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రేకుల్‌పల్లి భూపతిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement