
నిర్మల్
కొడుకును కడతేర్చిన తండ్రి
ఆర్థిక గొడవల కారణంగా తండ్రి కొడుకును కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని మల్లాపూర్లో శుక్రవారం తెల్ల వారుజామున జరిగింది.
శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
IIలోu
బాసర పండితుడికి అరుదైన అవకాశం
● కంచి కామకోటి సరవజ్ఞ 71వ పీఠం ఉత్తరాధికారిగా ఎంపిక
బాసర : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నవరానికి చెందిన ఎస్వీఎస్ఎస్.గణేశ్శర్మ ఋగ్వేద వేదపండితుడు. తన గురువు వద్ద ఋగ్వేదాన్ని అభ్యసించి బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో ఋగ్వేద పారాయణ దారుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు అరుదైన అవకాశం దక్కింది. కంచికామకోటి సర్వజ్ఞ పీఠం 71వ ఉత్తరాధికారి గా ఎంపికయ్యారు. ఈనెల 30న అక్షయతృతీయ రోజున బాధ్యతలు స్వీకరించనున్నారు. గణేశ్ శర్మ ఎంపికపై బాసర ఆలయ వైదిక బృందం హర్షం వ్యక్తం చేసింది.
నిర్మల్/భైంసాటౌన్: ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమంలో జిల్లా మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి అండగా నిలిచింది. ఆపార్టీ ఇచ్చిన ప్రతీ పిలుపులో భాగమైంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు ఆ పార్టీకే జైకొట్టింది. గల్లీ నుంచి ఢిల్లీదాకా ఎదిగిన మహామహులైన నేతలు, సీనియర్ కార్యకర్తలు, భారీ కేడర్తో ‘కారు’పార్టీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఎన్నికలేవైనా.. గెలుపు ఆపార్టీదే ఉండేది. ఏ మీటింగైనా, ఏ సభ పెట్టినా.. ‘గులాబీ’ రెపరెపలాడేది. ఒక్క పిలుపుతోనే వేలమంది ఎక్కడ సభ ఉన్నా.. తరలివెళ్లేవారు. చిన్న పదవులైనా నాయకుల మధ్య పోటాపోటీ ఉండేది. ఇలాంటి బలమైన నేపథ్యాన్ని నమ్ముకునే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఎదిగింది. కానీ.. ‘కారు’ జోరుకు గత ఎన్నికల్లో బ్రేకులు పడటం, కేసీఆర్ సర్కార్ అధికారం కోల్పోవడమే ఆలస్యం.. సీన్ మొత్తం రివర్స్ అయింది. అప్పటిదాకా ఓ వెలుగు వెలిగిన ‘గులాబీ’ వెలసిపోతూ వచ్చింది. పదేళ్లు అధికారాన్ని అనుభవించిన వాళ్లు మొదలు.. గల్లీల్లో చెలాయించిన నేతలదాకా అందరూ బీఆర్ఎస్ను వీడారు. ఒక్కో కారణం చూపుతూ హస్తం చెంతకు, కమలం గూటిలోకి చేరిపోయారు. అక్కడక్కడ ఉన్న కొంతమంది గులాబీనేతల్లోనూ సమన్వయం లేకపోవడంతో పార్టీ రజతోత్సవ వేళలోనూ అధిష్టానం జిల్లాపై పెద్దగా దృష్టిపెట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది.
నేతలు లేక వెతలు..
ఏ పార్టీ మనుగడ సాగించాలన్న సమర్థులైన నేతలు కావాలి. జిల్లాలో బీఆర్ఎస్కు ఇప్పుడు అదే పెద్ద లోటు. మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారిలతోపాటు సీనియర్లందరూ పార్టీలు మారడంతో వారితోపాటు మిగిలిన నాయకులు, కార్యకర్తలూ బీఆర్ఎస్ను వీడారు. ఖానాపూర్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన జాన్సన్నాయక్ కొంత కష్టపడుతున్నా.. కావాల్సినంత బలగం లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. నిర్మల్లో నియోజకవర్గ ఇన్చార్జిగా సీనియర్ నేత రాంకిషన్రెడ్డి శ్రమిస్తున్నా.. ఆయనకంటూ కేడర్ లేకపోవడం పార్టీకి మైనస్గా మారింది.
ముధోల్లో ఉన్నా..
జిల్లాలో బీఆర్ఎస్కు ముధోల్ నియోజకవర్గంలోనే ఎక్కువమంది సీనియర్ నేతలు ఉన్నారు. కానీ వారిమధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందిగా మారిందని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీకి సమన్వయకమిటీ సభ్యులుగా ఉన్న విలాస్ గాదేవార్, పి.మాదేవి, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమ్రేవార్ మధ్య సమన్వయం లేదన్న విమర్శలు పార్టీ కేడర్ నుంచే వినిపిస్తున్నాయి. వీరి సమన్వయలోపం జనసమీకరణపై ప్రభావం పడుతుందని భావించిన నాయకత్వం మాజీ మంత్రి జోగు రామన్నను రంగంలోకి దించింది. ఈ మేరకు ఇటీవల ఆయన భైంసాకు చేరుకుని సభ సన్నాహాలపై చర్చించినట్లు తెలిసింది. నలుగురికి మండలాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
కనిపించని రజతోత్సాహం..
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఒక్కరోజే గడువున్నా.. జిల్లాలో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. గోడలపై రాతలు, ఒకట్రెండు మీటింగ్లు మినహా పెద్దగా సమాయత్తమవుతున్న దాఖలాలూ లేవు. ఈనెల 27(ఆదివారం)న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ ఎత్తున బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు చేసింది. ఇతర జిల్లాల్లో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు పెట్టడం, జనసమీకరణకు ఏర్పాట్లు చేయడం పూర్తిచేశారు. పార్టీ నుంచీ సీనియర్ నేతలు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మాత్రం అలాంటి నేతల పర్యటనలేవీ కనిపించలేదు. బలమైన కేడర్ లేకున్నా.. ఇప్పటికీ కేసీఆర్పై అభిమానం ఉన్నవాళ్లు జిల్లాలో చాలామంది ఉన్నారు. కానీ అలాంటివాళ్లను సమన్వయం చేసుకుని రజతోత్సవానికి తీసుకువెళ్లే లీడరే లేడన్న మాట వినిపిస్తోంది.
న్యూస్రీల్
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో కళ తప్పిన గులాబీ
పెద్ద లీడర్లు లేరు.. భారీ కేడరూ లేదు
ఒకరిద్దరు ఉన్నా.. సమన్వయం కరువు
బీఆర్ఎస్ సభకు వెళ్లేది ఎందరో?

నిర్మల్