
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
తానూరు: భూభారతి చట్టంతో భూసమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా హాజరై మాట్లాడారు. వచ్చే నెలలో రెవెన్యూ అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తానూరు, ఎల్వి, హిప్నెల్లి, కోలూరు, దౌలతాబాద్ గ్రామాల్లో గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలువ నిర్మాణానికి ఒక్కో రైతు వద్ద ఎకరం భూమి తీసుకుని మిగతా భూమిని కూడా హోల్డ్లో పెట్టగా ఐదేళ్లుగా వివరాలు ఆన్లైన్లో చూపెట్టడం లేదని వాపోయారు. ఐదేళ్లుగా రైతుబంధు, రుణమాఫీ వర్తించడం లేదని రైతులు కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్య పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందర్రావ్ పటేల్, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ్రావ్ పటేల్, తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీవో నసీరొద్దీన్, సిబ్బంది ఉన్నారు.
భైంసా మండలం వానల్పాడ్లో..
భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ రైతువేదికలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరై మాట్లాడారు. భూభారతి చట్టంలో భాగంగా సాదాబైనామ ప్రక్రియను మళ్లీ అమలులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు నిర్దిష్ట గడువు విధించామని తెలిపారు. అనంతరం రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.