
పట్టుదలతో లక్ష్యం చేరుకోవాలి
భైంసాటౌన్: విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పట్టుదలతో లక్ష్యం చేరుకోవాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించా రు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని పలు వురు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఇటీవల ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను ఆమె అభినందించారు. భవిష్యత్లో ఉత్తమ ర్యాంకులతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, సీఐలు నైలు, గోపీనాథ్, మల్లేశ్, ఎస్సైలు శంకర్, అశోక్, రవీందర్ పడ్వాల్, గౌసొద్దీన్, భరోసా సెంటర్ సిబ్బంది జ్యోతి, శిరీష, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.