నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Apr 23 2025 8:13 AM | Updated on Apr 23 2025 8:49 AM

నిర్మ

నిర్మల్‌

కనకం.. ఇక కొనలేం..
పసిడి ధర పరుగులు పెడుతోంది. సామాన్యుడికి అందనంత దూరంలో ‘లక్ష’ణంగా కొండెక్కి కూర్చుంది. తొలిసారిగా తులం బంగారం లక్ష మార్కు దాటేసింది.

పుస్తకనేస్తం..జీవన సర్వస్వం

జీవితంలో వెలుగులు నింపే గొప్ప అస్త్రం పుస్తకం. ఎంత చదివితే అంత విజ్ఞానవంతుల్ని చేయగలి గే ఏకైక శక్తి పుస్తకానికే ఉంది. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా కథనం.

బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

10లోu

ఉర్దూ మీడియంలో

భైంసా విద్యార్థినుల సత్తా..

ఇద్దరికి స్టేట్‌ ఫస్ట్‌..

మరో రెండు సెకండ్‌, థర్డ్‌ ర్యాంకులు..

భైంసాటౌన్‌: భైంసాలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటారు. సెకండియర్‌ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో స్టేట్‌ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఫస్టియర్‌లోనూ స్టేట్‌ ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ర్యాంకులు సాధించారు. ఎంపీసీ సెకండియర్‌లో తుబా తహరీన్‌ 979, బైపీసీలో అఫీరా తాజీన్‌ 984 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకులు సాధించారు. ఫస్టియర్‌ విద్యార్థిని నిషత్‌ తరన్నుమ్‌ 461(ఎంపీసీ)మార్కులతో ఫస్టియర్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. తన్జీలా ఫిర్దోస్‌ 458 మార్కులతో రెండో ర్యాంకు, అయేషా ఖానమ్‌ 456 మార్కులతో మూడోర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ శివరంజని తెలిపారు.

పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నిర్మల్‌చైన్‌గేట్‌: ఇందిరమ్మ పథకంలో లబ్ధిదా రుల ఎంపిక పారదర్శకంగా జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లు, అధికారుల ను ఆదేశించారు. సచివాలయం నుంచి సీఎస్‌ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌, హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ గౌతమ్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 30లోపు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని తెలి పారు. అనర్హులను తొలగించాలని, సామగ్రి ధరలు పెరగకుండా చూడాలన్నారు. పట్టణా ల్లో జీ+3 మోడల్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. భూభారతి చట్ట అమలుకు వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుల వివరాలు, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని వివరించారు.

క్రీడా శిబిరాల పోస్టర్‌ ఆవిష్కరణ

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులు క్రీడల్లో శిక్షణ పొందేందుకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ అభిలా ష అభినవ్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమ్మర్‌ స్పోర్ట్స్‌ క్యాంప్‌–2025 పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, కిశోర్‌కుమార్‌, ఆర్డీవో లు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, డీఈవో రామారావు, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

నిర్మల్‌ రూరల్‌: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించారు. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో సెకండ్‌ ఇయర్‌లో జిల్లా రాష్ట్రంలో 10వ స్థానంలో నిలువగా, ఫస్ట్‌ ఇయర్‌లో 16వ స్థానం సాధించింది. మొత్తంగా ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించారు. దాదాపు నెల రోజుల తర్వాత ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది. ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 58.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌ విద్యార్థులు 70.57 శాతం పాసయ్యారు. గతేడాది 68 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా 12వ స్థానంలో నిలిచింది. ఈసారి మాత్రం రెండు స్థానాలు ఎగబాకి పదో స్థానంలో నిలిచింది.

సెకండియర్‌లో 70.57% ఉత్తీర్ణత..

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సెకండియర్‌లో జిల్లా 70.57% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 5,211 మంది విద్యార్థులకు 3,693 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,342 మంది బాలురకు 1,371 మంది(58.54%) పాస్‌ అయ్యారు. 2,869 మంది బాలురకు 2,322 మంది (80.93%) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు.

● సెకండ్‌ ఇయర్‌ ఒకేషనల్‌ కేటగిరీలో మొత్తం 852 మంది విద్యార్థులకు 575 మంది(67.49%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 436 మందికిగాను, 226 (51.83%)పాస్‌ అయ్యారు. 815 మంది బాలికలకు 349 మంది (83.89%) ఉత్తీర్ణులయ్యారు.

ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు ఇలా....

ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఇదే స్థానం దక్కింది. మొత్తం 5,483 మందికి 3,223 మంది (58.78%) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,421 మంది బాలురకు 1,054 మంది(43.54%) పాసయ్యారు. 3,062 మంది బాలికలకు 2,169 మంది (70.84%) పాసయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో మొత్తం 1,088 మంది విద్యార్థులకు 530 మంది(48.71 %)పాస్‌ అయ్యారు. ఇందులో 575 మంది బాలురకు 192 మంది (33.39%)పాస్‌ అయ్యారు. 513 మంది బాలికలకు గాను 338 మంది (65.89%) ఉత్తీర్ణులయ్యారు.

● ఫస్ట్‌ ఇయర్‌ ఒకేషనల్‌ కేటగిరిలో 48.71% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో మొత్తం 1,088 మంది విద్యార్థులకు 530 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 575 మందికి 192 మంది (33.39%)పాస్‌ అయ్యారు. బాలికలు 513 మందికి గాను 338 మంది(65.89%) పాస్‌ అయ్యారు.

మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..

ఇంటర్‌ విద్యార్థులకు మే నెల 22 నుంచి అడ్వాన్స్‌ డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం బుధవారం నుంచి ఈనెల 30లోగా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్‌ కోసం ఒక్కో పేపర్‌కు 100 చొప్పున, రీ వెరిఫికేషన్‌ కోసం ఒక్కో పేపర్‌కు రూ .600 చొప్పున ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. విద్యార్థులకు షార్ట్‌ మెమోలు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.

దిలావర్‌పూర్‌ కేజీబీవీ విద్యార్థుల విజయ సంకేతం

న్యూస్‌రీల్‌

ఇంటర్‌ ఫలితాల్లో సత్తా

రాష్ట్రస్థాయిలో జిల్లాకు 10వ స్థానం

గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగైన ఫలితాలు

నిషత్‌ తరనుమ్‌

(ఎంపీసీ/461)

6 కేజీబీవీల్లో 100% రిజల్ట్‌

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 12 కేజీబీవీలు ఉండగా, 6 కేజీబీవీల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీలలో సెకండియర్‌లో 96 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఫస్ట్‌ ఇయర్‌లో 87.42% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. నర్సాపూర్‌(జి), దిలావర్పూర్‌, దస్తురాబాద్‌, జామ్‌, లక్ష్మణచాంద, మామడ కళాశాల విద్యార్థులు 100% పాసయ్యారు. నర్సాపూర్‌(జి), దిలావర్పూర్‌ కేజీబీవీ కళాశాలలో ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులందరూ ఉత్తీర్ణులై సత్తా చాటారు. నర్సాపూర్‌ (జి) కళాశాల విద్యార్థిని అనూష 1000 మార్కులకు 990 సాధించి సత్తా చాటింది. జిల్లాలో అత్యల్పంగా భైంసా కేజీబీవీలో సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు 77 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఫస్ట్‌ ఇయర్‌లో 32 శాతం మంది మాత్రమే పాస్‌ అయ్యారు.

నిర్మల్‌1
1/6

నిర్మల్‌

నిర్మల్‌2
2/6

నిర్మల్‌

నిర్మల్‌3
3/6

నిర్మల్‌

నిర్మల్‌4
4/6

నిర్మల్‌

నిర్మల్‌5
5/6

నిర్మల్‌

నిర్మల్‌6
6/6

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement