
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
నిర్మల్టౌన్: చారిత్రక నేపథ్యం కలిగిన నిర్మల్ పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్ చెరు వు, బత్తీఘడ్, శ్యామ్గడ్ తదితర పర్యాటక ప్రాంతాలను ఆదివారం ఆయన సందర్శించా రు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిర్మల్పట్టణంలో చాలా ప్రాంతాలున్నాయని తెలిపా రు. పలు ప్రాంతాల్లో త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. రమేశ్ రెడ్డి వెంట నిర్మల్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థల చైర్మన్లు అర్జుమంద్ అలీ, సత్తు మల్లేశ్, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తదితరులున్నారు.