
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
నిర్మల్టౌన్: అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివా రం బైక్ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ బంక్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో పోస్టర్లు అతి కించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవా ల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభా కర్ మాట్లాడారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫైరింజన్ వచ్చేదాకా ఎదురుచూడకుండా మంటలు ఆర్పే ప్రయత్నం చేయాలని చెప్పారు. అనంతరం రిటైర్డయిన ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజలింగం, సిబ్బంది సుభాష్, రమే శ్, హుస్సేన్, పిర్ధస్ తదితరులు పాల్గొన్నారు.