
‘సమావేశాన్ని అడ్డుకుంటాం’
ముధోల్: మండలంలోని కారేగాం గ్రామంలో సో మవారం భూభారతిపై నిర్వహించే అవగాహన సమావేశాన్ని అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపా రు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. గతేడాది అక్టోబర్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఏడుగురిని ఎన్నుకున్నట్లు తెలిపారు. శనివారం నిర్వహించిన ఇందిరమ్మ పథకం అవగాహన సదస్సులో కమిటీలోని ఇద్దరు పేర్లకు బదులు కొత్తవారి పేర్లు చేర్చారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ భూభారతి సమావేశానికి హాజరు కానున్న కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించకుంటే సమావేశాన్ని అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపారు.