
ఘనంగా ప్రతిష్ఠాపనోత్సవం
సారంగపూర్: మండలంలోని చించోలి (బీ) గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించిన గంగామాత ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠానోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హాజరై పూజలు చేశారు. ఆయనకు స్థానిక గంగపుత్ర, బెస్త సంఘం నాయకులు స్వాగతం పలికి సన్మానించా రు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. తాను దేవాదాయశాఖ మంత్రిగా ఉ న్నప్పుడే ఆలయానికి రూ.12లక్షలు మంజూ రు చేయించానని గుర్తు చేశారు. నాయకులు నల్ల వెంకట్రామిరెడ్డి, మాణిక్రెడ్డి, అహ్మద్ ముక్త్యార్, మహిపాల్రెడ్డి, మాధవరావు, చందు, భూమేశ్, షేక్ షెఫిక్ తదితరులున్నారు.