
పని చేయకుంటే పక్కన పెట్టుడే..!
● అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు ● నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి ● త్వరలో అంగన్వాడీలలో ఖాళీల భర్తీ ● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ● ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, సీ్త్రశిశు సంక్షేమ శాఖలపై సమీక్ష ● అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి
నిర్మల్చైన్గేట్: ‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు.. పనులు చేయడంలో అలసత్వం వహించేవారిని ఉపేక్షించేది లేదు.. పనులను నిర్ణీత గడువులోపు నాణ్యతతో పూర్తి చేయించాలి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై శనివారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న , పని చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పక్కన పెట్టాలని సూచించారు. టెండర్ దశ నుంచే పనులు వేగవంతం చేసి, వర్షాకాలానికి ముందు పనులు పూర్తిచేయాలన్నారు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి, పనులు పూర్తి చేయించాలని సూచించా రు. పనుల నాణ్యతపై రాజీ లేకుండా చూడాలని, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులకు వాస్తవాలు చెప్పాలని ఫీల్డ్ విజిట్ చేసి ఎప్పటికప్పుడు ఏఈలు మిషన్ భగీరథ పనులు సమీక్షించుకోవాలన్నారు.
అంగన్వాడీల బలోపేతం, సౌకర్యాల విస్తరణ
త్వరలో అంగన్వాడీల్లో టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలకు రూ.12 లక్షలతో పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. గతంలో మండలానికి ఒక భవనం నిర్మిస్తే, ఇప్పుడు రెండు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూ డేళ్లలో అంగన్వాడీలకు సొంత భవనాలు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తామని, సీనియర్ సిటిజన్ డేకేర్ సెంటర్లు, ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మహిళా సంఘాలకు చెక్కులు..
మంత్రి సీతక్క, కలెక్టరేట్కు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మహిళా పోలీసులు ఏర్పాటు చేసిన ‘శివంగి’ బృందాన్ని లాంఛనంగా ప్రారంభించి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. తర్వాత మహిళా సంఘాలకు, మెప్మాలకు మంజూరైన చెక్కులను కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశా రు. బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు, వసూలులో నిర్మల్ జిల్లా ప్రగతిని మంత్రి ప్రశంసించారు. సమావేశంలో ఎంపీ గోడం నగేష్, నిర్మల్, ఆదిలా బాద్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, అసిఫాబా ద్, బోథ్ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, పాయల్ శంకర్, పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్ పటేల్, పాల్వాయి హరీశ్బాబు, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐసీడీఎస్ సెక్రటరీ అనితా రామచంద్రన్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా కలెక్టర్లు కుమార్ దీపక్, అభిలాష అభినవ్, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా అధికారిని నియమించాలి..
మహిళా శిశు సంక్షేమ శాఖకు జిల్లా అధికారి పోస్ట్ను భర్తీ చేయాలి. సీడీపీవోలకు జిల్లా అధికారిగా అదనపు బాధ్యతలు కేటాయించడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్దులకు సరైన సేవలు అందడం లేదు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు సంబంధించి ప్రపోజల్ ఎవరిని అడిగి చేస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా 2022లో అగ్రిమెంట్ చేసిన పనులు 2025 నాటికి కూడా పూర్తి కాలేదు. – ఏలేటి మహేశ్వర్ రెడ్డి,
నిర్మల్ ఎమ్మెల్యే
నీటి సమస్య పరిష్కరించాలి
ముధోల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీరు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గానికి కేటాయించిన రూ.కోటి సరిపోవు. వాటిని రూ.3.50 కోట్లకు పెంచాలి. తానూర్, కుభీర్, ముధోల్ మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. 600 మీటర్ల లోతు బోరువేసినా నీరు పడడం లేదు.
– రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే

పని చేయకుంటే పక్కన పెట్టుడే..!

పని చేయకుంటే పక్కన పెట్టుడే..!

పని చేయకుంటే పక్కన పెట్టుడే..!

పని చేయకుంటే పక్కన పెట్టుడే..!