ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ డీఎం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ డీఎం

Apr 20 2025 1:51 AM | Updated on Apr 20 2025 1:51 AM

ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ డీఎం

ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ డీఎం

నిర్మల్‌టౌన్‌: ఆర్టీసీ నిర్మల్‌ డిపో మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పండరి, నిర్మల్‌ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేకు పూల మొక్క అందజేశారు. బస్సులేని గ్రామాలైన సారంగాపూర్‌ మండలం జీవిలి, లక్ష్మణచాంద మండలం మాచాపూర్‌ , నిర్మల్‌ మండలం మేడిపల్లి గ్రామాలకు బస్సులు నడపాలని ఎమ్మెల్యే సూచించారు. రూట్‌ సర్వే చేసి ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా బస్సులు నడుపుతామని డీఎం తెలిపారు. ఆయన వెంట అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement