సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Apr 17 2025 12:57 AM | Updated on Apr 17 2025 12:57 AM

సమస్య

సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్‌ టౌన్‌: సమస్యలు పరిష్కరించాలని ఫా రెస్ట్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మొజం అలీఖాన్‌ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్‌ కార్యాలయంలో సీసీఎఫ్‌ శర్వానన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. సమస్యలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సంక్షేమం తదితర అంశాలపై చ ర్చించారు. అసోసియేషన్‌ సభ్యులు ఎండీ నజీ ర్‌ఖాన్‌, రవీందర్‌, సుందర్‌ తదితరులున్నారు.

18 నుంచి జొన్నల కొనుగోళ్లు

భైంసాటౌన్‌: ముధోల్‌ నియోజకవర్గంలో ఈనెల 18 నుంచి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పీ రామారావు పటేల్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ముధోల్‌ నియోజకవర్గంలో అధిక విస్తీర్ణంలో రైతులు జొన్న సాగు చేస్తారని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, కొనుగోలు పరిమితి ఎకరాకు 14 క్వింటాళ్లకు పెంచాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులను ఫోన్‌ చేసి కొనుగోళ్లకు ఆదేశాలిచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు వెల్లడించారు.

అక్రమాలను అరికట్టాలి

ఖానాపూర్‌: ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శులు పీటర్‌, సురేందర్‌ కోరారు. బుధవారం ఖానాపూర్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఈజీఎస్‌ టీఏలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఒక్కో కూలీ నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కొలతలు తీసి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సమస్యలు పరిష్కరించాలి
1
1/1

సమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement