
అంబేడ్కర్ ఆశయాలు సాధిద్దాం
● ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి
నివాళులర్పిస్తున్న ఏలేటి మహేశ్వర్రెడ్డి
నిర్మల్చైన్గేట్: సామాజిక సమానత్వం, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణకు నిలువెత్తు ప్రతిరూపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మహనీయుడి ఆశయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్పై సోమవారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, అధికారులు, నాయకులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ అణచివేతల నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న తపనతో అంబేడ్కర్ ప్రపంచానికే మార్గదర్శకమైన రాజ్యాంగం రూపొందించారని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతోనే నేడు బడుగు, బలహీనవర్గాల ప్రజలు సైతం అన్నిరంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపొందించడంలో అంబేడ్కర్ ముఖ్య భూమిక పోషించారన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకు అనుక్షణం పోరాడారని గుర్తుచేశారు. కులమత బేధాలను తొలగించి, ప్రతి ఒక్కరికీ హక్కులను కల్పించేందుకు పోరాడిన వ్యక్తి అంబేడ్కర్ అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని తెలిపారు. అనంతరం అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి.. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు.
వేడుకల్లో వాగ్వాదం..
అధికారికంగా నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో గందరగోళం నెలకొంది. వివిధ కుల సంఘాల నాయకులను వేడుకలకు ఆహ్వానించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పలువులు అధికారులు, కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే వేదికపైకి ఎమ్మార్పీఎస్ నాయకులను ఆహ్వానించలేదు. దీంతో అంబేడ్కర్ భవనం ఎదుట నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని జయంతి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించడంతో అంగీకరించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం.. ఎమ్మార్పీఎస్ నాయకులు మెడలో మందకృష్ణ మాదిగ ఫొటోతో ఉన్న నల్ల కండువాలు వేసుకున్నారు. అధికారిక కార్యక్రమానికి పార్టీల కండువాలు కప్పుకుని రావొద్దని మాల సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మళ్లీ వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దాదాపు గంటన్నరపాటు ఘర్షణ పడ్డారు. కార్యక్రమానికి వచ్చిన సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు నాయకుల తీరు చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏఎస్పీ రాజేశ్మీనా చేరుకొని ఇరువర్గాల నాయకులను అక్కడి నుంచి పంపించారు. తర్వాత అంబేడ్కర్ జీవిత చరిత్ర, భారత దేశానికి ఆయన చేసిన సేవలను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, సంస్కృతిక సారధి కళాకారులు ఆవిష్కరింపజేశారు. అనంతరం పలువురు అధికారులు, కుల సంఘాల నాయకులు అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలియజేశారు. కార్యక్రమాల్లో జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమ అధికారి రాజేశ్వర్గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకరయ్య, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, అధికారులు, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు పాకాల రాంచందర్, ముడుసు సత్యనారాయణ, మేడారం ప్రదీప్, రమణారెడ్డి, కొప్పుల శ్రీధర్, రాఘవేందర్, అనుముల భాస్కర్, విద్యార్థులు

అంబేడ్కర్ ఆశయాలు సాధిద్దాం

అంబేడ్కర్ ఆశయాలు సాధిద్దాం

అంబేడ్కర్ ఆశయాలు సాధిద్దాం