ఎంత..? | - | Sakshi
Sakshi News home page

ఎంత..?

Apr 15 2025 12:10 AM | Updated on Apr 15 2025 12:10 AM

ఎంత..

ఎంత..?

నమోదు హాజరు

నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు విద్యార్థుల నమోదు, హాజరు పెంపొందించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక యుడైస్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్యను క్షేత్రస్థాయిలో హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యతో సరిపోల్చేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. యుడైస్‌ ప్లస్‌ సర్వే పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో డీఎడ్‌, బీఎడ్‌ విద్యార్థులతో సమాచార సేకరణకు సిద్ధమైంది. ఈ సర్వేలో పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్యను పరిశీలించి, గణాంకాలను నమోదు చేస్తారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయా లేదా అని కూడా ధ్రువీకరిస్తారు. ఈ సర్వే నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు నిధులు కేటాయిస్తాయి. విద్యా సంస్కరణలను మరింత పటిష్ఠం చేస్తాయి.

జిల్లాలో సర్వే ఇలా..

నిర్మల్‌ జిల్లాలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పరిధిలో సుమారు 735 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 532 ప్రాథమిక పాఠశాలలు, 86 ప్రాథమికోన్నత పాఠశాలలు, 117 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 49 వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు జిల్లా విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సర్వేలో ఏప్రిల్‌ 15 నుంచి 21 వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పరిశీలించి, ఛాత్రోపాధ్యాయులు నివేదికలను రూపొందిస్తారు. సర్వే కోసం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. సంబంధిత కాంప్లెక్స్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ (సీఆర్పీలు) సహకారం అందిస్తారు.

క్షేత్రస్థాయి సమాచార సేకరణ

నిర్మల్‌ జిల్లాలో డీఎడ్‌, బీఎడ్‌ చదువుతున్న 60 మంది ఛాత్రోపాధ్యాయులను ఈ సర్వే కోసం కేటాయించారు. వీరు ప్రతిరోజూ రెండు పాఠశాలల చొప్పున సర్వే చేపడతారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలను అప్పగించి, నివేదికలను రూపొందించేలా శిక్షణ ఇచ్చారు. యుడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్యను హాజరైన విద్యార్థుల సంఖ్యతో సరిపోల్చి, వాస్తవ గణాంకాలను నమోదు చేస్తారు.

సర్వే ప్రాముఖ్యత..

ఈ సర్వే రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు నిధుల కేటాయింపు కోసం కీలకం కానుంది. ప్రభుత్వం ఇ ప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూ నిఫామ్‌లు, దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ భత్యం వంటి సౌకర్యాలను అందిస్తోంది. అయినప్పటికీ, కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, ఈ సర్వే ద్వారా వాస్తవ గణాంకాలను సేకరించి, నమోదు పెంపొందించే చర్యలు చేపట్టనున్నారు.

నేటి నుంచే యుడైస్‌ ప్లస్‌ సర్వే...

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య, హాజరుపై దృష్టి

జిల్లాకు 60 మంది ఛాత్రోపాధ్యాయుల కేటాయింపు..

క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ..

రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు వంటి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుంటారు. ఇందుకుగాను ఛాత్రోపాధ్యాయులు జిల్లాకు కేటాయించబడ్డారు. వీరు ఆయా పాఠశాలలను సందర్శించి యూడైస్‌ ప్లస్‌పై ఈనెల 15 నుంచి 21 వరకు సర్వే చేపడతారు. జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

– పి.రామారావు, డీఈవో

ఎంత..?1
1/1

ఎంత..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement