12 గంటలు | - | Sakshi
Sakshi News home page

12 గంటలు

Apr 12 2025 2:48 AM | Updated on Apr 12 2025 2:48 AM

12 గం

12 గంటలు

● తునికాకు సేకరణకు వెళ్లి తప్పిపోయిన మహిళలు ● గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో దారితప్పిన వైనం.. ● ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ.. ● ఎస్పీ చొరవతో క్షేమంగా ఇంటికి చేరిన బాధితులు
అడవిలో..

తప్పిపోయిన మహిళలను కప్పనపల్లి గ్రామానికి

తీసుకు వస్తున్న ఎస్పీకి పూలతో స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు

గ్రామస్తులు, పోలీసుల గాలింపు

మహిళలు రాత్రి 8 గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామస్తులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని, గ్రామస్తులతో కలిసి 50 మందితో రెండు బృందాలుగా ఏర్పడి రాత్రంతా గాలింపు చేపట్టారు. లొంకపాడు లోయ సమీపంలోకి వెళ్లగా, గ్రామస్తుల అరుపులు మహిళలకు వినిపించాయి. వారు ‘‘రక్షించండి’’ అని కేకలు వేసినా, ఆ శబ్దం గ్రామస్తులకు వినిపించలేదు. దీంతో రాత్రంతా గాలింపు ఫలితం ఇవ్వలేదు.

నలుగురు వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలు. వ్యవసాయ పనులతోపాటు ఉపాధి నిమిత్తం తునికాకు సేకరణకు వెళ్తుంటారు. ఎప్పటిలాగే గురువారం మధ్యాహ్నం తునికాకు సేకరణకు వెళ్లారు. ఆకు సేకరించుకుని తిరిగి ఇంటికి బయల్దేరారు. కానీ, అప్పటికే చీకటి పడడం, ఒక్కసారిగా గాలిదుమారం, ఉరుములు, మెరుపులు రావడంతో ఆందోళనతో దారితప్పారు. ఎటు వెళ్లాలో తెలియక అడవిలోనే చిక్కుకుపోయారు. దాదాపు 12 గంటలపాటు రాత్రంతా దట్టమైన అడవిలోనే గడిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎటువైపు నుంచి ఏ జంతువు వచ్చి దాడిచేస్తుందో అని ఊపిరి బిగపట్టుకుని కంటి రెప్ప వాల్చకుండా గడిపారు. శుక్రవారం ఉదయం ఎస్సీ జానకీ షర్మిల చొరవతో నలుగురినీ సురక్షితంగా ఇంటికి చేర్చారు.

– మామడ

మామడ మండలం కప్పన్‌పల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు రాజుల రాధ, గట్టుమీది లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ వ్యవసా య కుటుంబాల నుంచి వచ్చినవారు. వ్యవసాయ పనులతోపాటు ఉపాధి కోసం వారు సమీప అటవీ ప్రాంతంలో తునికాకు సేకరిస్తుంటారు. సేకరించిన ఆకును కట్టలుగా కట్టి విక్రయించడం, బీడీలు చుట్టడం ద్వారా వారు ఆదాయం పొందుతారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు నలుగురూ తునికాకు సేకరణకు అడవికి బయలుదేరారు. త్వరగా తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు.

దారితప్పిన ఘటన

మహిళల కథనం ప్రకారం, సాయంత్రం 5 గంట ల వరకు ఆకు సేకరించి ఇంటికి బయలుదేరారు. అయితే, ఆకాశంలో ఒక్కసారిగా మబ్బులు కమ్మ డం, గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో చీకటి కమ్ముకోవడంతో ఆందోళనకు గురయ్యా రు. వచ్చిన దారిని మరచిపోయారు. ధైర్యంగా గ్రామం వైపు నడిచినా, ఎంతసేపు నడిచినా ఊరు కనిపించకపోవడంతో భయం ఆవహించింది. రాత్రి 7 గంటలకు పూర్తిగా చీకటి పడింది. గుట్టలు, లోయలతో కూడిన దట్టమైన అడవిలోకి చేరుకున్నారు. తాము దారి తప్పామని గుర్తించి, కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ, సిగ్నల్‌ అందకపోవడంతో సంప్రదింపులు కుదరలేదు. చేసేదేమీ లేక, ఒక చెట్టు కింద కూర్చుని రాత్రంతా భయంతో గడిపారు. వన్యప్రాణుల దాడి భయంతో కేకలు వేస్తూ, కంటిరెప్ప వాల్చకుండా గడిపారు.

ఉదయం ఫోన్‌ సిగ్నల్‌తో ఆశ..

శుక్రవారం ఉదయం 6 గంటలకు సూర్యోదయంతో కొంత వెలుగు రావడంతో మహిళలు సమీపంలోని చెట్టు ఎక్కి ఫోన్‌ సిగ్నల్‌ కోసం ప్రయత్నించా రు. అయినా సిగ్నల్‌ రాలేదు. చివరకు లోయ నుంచి గుట్టపైకి ఎక్కారు. అక్కడ సిగ్నల్‌ రావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వారి స్థానాన్ని గుర్తించారు. అయితే, దట్టమైన అడవి, గుట్టల కారణంగా ఆ ప్రాంతానికి చేరుకోవడం కష్టంగా మారింది.

గ్రామస్తుల స్వాగతం

మహిళలను సురక్షితంగా తీసుకొచ్చిన ఎస్పీ జానకీ షర్మిలకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఆమె చొరవ, సమయస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామస్తులు వచ్చినా.. గుర్తించలేదు

తునికి ఆకు కోసం వచ్చి తప్పిపోయామనే సమాచారంతో గ్రామస్తులు మ మ్మల్ని వెతికేందుకు రాత్రి అడవిలోకి వచ్చారు. మేము ఉన్న ప్రాంతానికి సమీపంలోకి వచ్చినా మమ్మల్ని గుర్తించలేదు. మేము ఎంత అరిచినా మా గొంతు వారికి వినిపించలేదు. దీంతో గుర్తించలేకపోయారు. – బత్తుల సరోజ

చెట్టెక్కి ఫోన్‌ చేసినా..

అటవీ ప్రాంతంతోనే చీకటి పడడంతో చెట్టుకింద కూర్చున్నాం. ఫోన్‌ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించాం. సిగ్నల్‌ రాలేదు. చివరకు చెట్టు ఎక్కి ఫోన్‌ చేశాం. అయినా ఫలితం లేదు. సమాచారం అందించలేక పోయామని ఏడ్చాను.

– కంబాల లింగవ్వ

రాత్రంతా భయం.. భయంగా

తునికి ఆకు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాం. చీకటి పడటంతో వచ్చిన దారి మర్చిపోయాం. గుట్టకింద చిక్కుకు పోయాము. ఎటు నుంచి ఏ జంతువు వస్తుందోనని భయంతో తెల్లవారే వరకు నిద్ర కూడా పోలేదు.

– రాజుల రాధ

తెల్లారితే బతికినట్లే అనుకున్నం..

అటవీ ప్రాంతంలో దారి తప్పడంతో చెట్టుకింద కూర్చున్నం. రాత్రి అటవీ జంతువుల నుంచి రక్షించుకోవడం కష్టం అనుకున్నాం. తెల్లారితే బతికినట్లే అనుకున్నం. ఉదయం మా కోసం వచ్చిన ఎస్పీ జానకీ షర్మిల,పోలీసులను చూడగానే మాకు ధైర్యం వచ్చింది.

– గట్టుమీది లక్ష్మి

ప్రజలకు రక్షణగా..

తునికాకు కోసం వెళ్లిన మహిళలు అటవీ ప్రాంతంలో తప్పిపోయారని ఉదయం సమాచారం అందింది. రాత్రి పోలీసులు, గ్రామస్తులు గాలించారు. ఆచూకీ లేకపోవడంతో 50 మంది పోలీసులతో ఉదయం అడవిలోకి వెళ్లాం. మహిళలు ఉన్న ప్రాంతాన్ని సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా గుర్తించాం. వారు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. నలుగురిని సురక్షితంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాం. అనుక్షణం ప్రజలకు రక్షణగా ఉంటాం.

– జానకీషర్మిల, ఎస్పీ

12 గంటలు1
1/5

12 గంటలు

12 గంటలు2
2/5

12 గంటలు

12 గంటలు3
3/5

12 గంటలు

12 గంటలు4
4/5

12 గంటలు

12 గంటలు5
5/5

12 గంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement