
నీటి వనరులను సంరక్షించుకోవాలి
మామడ/సారంగపూర్: నీటి వనరులను సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ జిల్లా పంచాయతీ, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్అన్నారు. మామడ మండలంలోని కొరిటికల్ గ్రామం, సారంగాపూర్ మండలం జౌళి గ్రామంలో ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకంలో భాగంగా వాటర్షెడ్ యాత్రను గురువారం వేర్వేరుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటియొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా సకాలంలో వర్షాలు కురవకుంటే సాగుపై ప్రభావం చూపుతుందన్నారు. వర్షం నీటిని కాపాడుకోవడానికి నీటి కుంటలు, రాళ్ల కట్టలు, కందకాలు, ఫాం పాండ్, చిన్న నీటి కంటలు, చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు. ఇలా చేస్తే వర్షపు నీరు భూమిలో ఇంకుతుందని తెలిపారు. వాటర్షెడ్ల ద్వారా నిలిచిన నీటిని పచ్చదనం పెంపొందించేందుకు, భూగర్భ జలాల పెంపునకు, వ్యవసాయానికి వినియోగించకోవచ్చని వివరించారు. అనంతరం నీటి విలువను తెలిపే వీడియోను ప్రజలకు చూపించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో సుశీల్రెడ్డి, డీపీవో శ్రీనివాస్, డీఎల్పీవో అజీజ్ఖాన్, ఏపీడీ ఓస ప్రసాద్, సెర్ప్ ఏపీఎం అరుణ, సారంగాపూర్ మండల ప్రత్యేకాధికారి బాలిక్ అహ్మద్, ఎంపీడీవో లక్ష్మికాంత్రావు, తహశీల్దార్ శ్రీదేవి, ఎంపీం అజీజ్ఖాన్, ఏపీవో లక్ష్మారెడ్డి, డీఆర్వో నజీర్ఖాన్, స్థానిక నాయకులు బాపురెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, జిల్లా పంచాయతీ, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్
వాటర్షెడ్ యాత్రలు ప్రారంభం

నీటి వనరులను సంరక్షించుకోవాలి