సాగునీరు అందించాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

సాగునీరు అందించాలని రాస్తారోకో

Apr 10 2025 12:09 AM | Updated on Apr 10 2025 12:09 AM

సాగునీరు అందించాలని రాస్తారోకో

సాగునీరు అందించాలని రాస్తారోకో

కడెం: సదర్‌మట్‌ ఆయకట్టుకు మరో తడి సాగు నీ రందించాలని రైతులు బుధవారం మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్‌ గ్రామం వద్ద నిర్మల్‌–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈనెల 9తో సదర్‌మట్‌ ఆయకట్టుకు సాగునీటి విడుదల ముగి యనుండగా రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తు తం వరి పొట్ట దశలో ఉందని తెలిపారు. మరో తడి సాగు నీరందించి ఆదుకోవాలని కోరారు. కలెక్టర్‌ రావాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ రైతులతో ఫోన్‌లో మాట్లాడారు. సాగు నీటి కోసం ఆందోళన చెందవద్దని తెలిపారు. నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీరందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement