
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ మండలాధ్యక్షుడు టీ రాజగంగన్న, పట్టణాధ్యక్షుడు గౌరికార్ రాజు ఆధ్వర్యంలో శు క్రవారం స్థానిక జగన్నాథ్రావు చౌరస్తాలో ఆందోళన చేశారు. అంబేడ్కర్ చౌరస్తాలోని కూరగాయల మార్కెట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా, దిష్టిబొమ్మ ద హనానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. నా యకులు అబ్దుల్ ఖలీల్, సుమన్, ప్రదీప్, గ జేందర్, శ్రావణ్, నరేందర్రెడ్డి, సుమిత్, చంద్రహాస్, షోయబ్, దివాకర్, మహిపాల్, మ హేందర్, వెంకటేశ్వర్రావు, రమేశ్, శ్రీనివాస్, లాజర్, శ్రీకాంత్, నరేశ్ తదితరులున్నారు.