పవార్‌కు ‘జడ్‌ ప్లస్‌’ భద్రత | Z Plus Security Given To Sharad Pawar By The Central Government | Sakshi
Sakshi News home page

పవార్‌కు ‘జడ్‌ ప్లస్‌’ భద్రత

Aug 22 2024 6:22 AM | Updated on Aug 22 2024 7:18 AM

Z Plus Security Given To Sharad Pawar By The Central Government

న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎప్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించింది. వీఐపీ భద్రతలో జడ్‌ ప్లస్‌ అత్యధిక రక్షణ కవచం.

 మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన 83 ఏళ్ల శరద్‌ పవార్‌కు జడ్‌ ప్లస్‌ రక్షణను కలి్పంచాలని కేంద్ర హోంశాఖ సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)ను కోరింది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ కింద 55 మంది సాయుధ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది రక్షణ కలి్పస్తారు. కేంద్ర ఏజెన్సీలు ముప్పును అంచనా వేసి.. శరద్‌ పవార్‌కు అత్యంత పటిష్టమైన భద్రతను కలి్పంచాలని సిఫారసు చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement